పాడి రైతుల ఆవేదన.. అరణ్య రోదన!
‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి.
అటకెక్కిన రాయితీ పథకాలు
నష్టపరిహారానికి ఎదురుచూపులు
యర్రంపేటలో పందిరి నీడన మూగజీవాలు..ఆ సమీపంలోనే అసంపూర్తిగా మినీగోకులం షెడ్డు
ఏలూరు వన్టౌన్, కొయ్యలగూడెం గ్రామీణ, ఉంగుటూరు, న్యూస్టుడే : ‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి. తర్వాత పడకపోవడంతో పనులు ముందుకు సాగక షెడ్డు పూర్తికాలేదు. మూగజీవాల నీడ కోసం పందిరి వేసి నెట్టుకొస్తున్నాం’ అని చెబుతున్నారు యర్రంపేటకు చెందిన మిద్దే చంద్రమ్మ. ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరానికి చెందిన రైతు తమ్మినీడి శ్రీనివాసరావుదీ ఇదే పరిస్థితి. తనకు రూ.1.90 లక్షలు రావాల్సి ఉండగా రూ.90 వేలు మాత్రమే ఖాతాలో పడ్డాయని తెలిపారు.
మినీగోకులంపై చిన్నచూపు.. పోషకులు తమ పశువులను రక్షించుకునేందుకు గత ప్రభుత్వ హయంలో మినీగోకులం షెడ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో షెడ్డుకు రూ.1.80 లక్షల వరకు ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. గతంలో నిర్మించిన వాటికి నగదు చెల్లించలేదు. కొందరు పాడి రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారిలో కొంతమందికి నగదు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లిస్తామని చెబుతూనే అయిదేళ్లు గడిచిపోయాయి.
ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువ శాతం పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు మేపుతూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పాడి రైతులను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ పథకాలకు పాతరేసింది. అలాగని కొత్తగా ప్రవేశపెట్టిందీ లేదు. పాతర గడ్డి, సంపూర్ణ దాణా (టీఎంఆర్), క్షీరసాగర, మినరల్ మిక్చర్ తదితరాలు రాయితీపై అందించడం నిలిపేశారు. గుత్తేదారుకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నెలకొనడంతో టీఎంఆర్ సరఫరా నిలిచి పోయినట్లు తెలిసింది. క్షీరసాగర పథకం స్థానంలో ప్రవేశపెట్టిన సమీకృత దాణా సరఫరా కూడా అంతంతమాత్రమే. ప్రస్తుతం ఇవేమీ అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. బొబ్బర్లు, సజ్జలు వంటి నాలుగు రకాల పశుగ్రాస విత్తనాల్ని 75 శాతం రాయితీపై అందించి సరిపెడుతున్నారు. లేగదూడల పౌష్టికాహారం నిమిత్తం అమలు చేసిన సునందిని పథకాన్నీ అటకెక్కించారు. ఒకవైపు తొలకరి వర్షాలు పలకరిస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది పశుగ్రాసం, దాణా సరఫరాకు సంబంధించి ఇంతవరకు ఇండెంట్లు కూడా సేకరించలేదని తెలుస్తోంది.
మూడేళ్లకే చేతులెత్తేశారు.. పశు నష్టపరిహార పథకం ప్రారంభించిన మూడేళ్లకే ప్రభుత్వం చేతులెత్తేసింది. దాని స్థానంలో రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసేలా పశు బీమాను తెరపైకి తెచ్చారు. అదీ అంతంత మాత్రంగానే అమలవుతోంది. ఉదాహరణకు కొయ్యలగూడెం మండలం విషయానికొస్తే గడిచిన మూడున్నరేళ్లలో 293 పశువులు మరణిస్తే 150కి నష్టపరిహారమిచ్చారు. పథకం రద్దయినా సదరు బకాయిలు ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. అసలు ఇస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేక పశు పోషకుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ పథకానికి సంబంధించి 1,715 మంది రైతులకు రూ.4.73 కోట్ల వరకు రావాల్సి ఉంది.
ఉంగుటూరు మండలం కాగుపాడులోని పశువుల ఆసుపత్రి భవనం శిథిలమైంది. పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. గేదెలకు వైద్యం అందించే షెడ్డు స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొత్త భవన నిర్మాణానికి తెదేపా హయాంలో రూ.40 లక్షలు మంజూరైనా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఏడాదిగా పశు వైద్యుడి పోస్టు భర్తీ కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యవసరమైతే ఆందోళనే!
[ 03-06-2024]
అమ్మ జన్మనిస్తే.. దాతలు తమ రక్తాన్ని పంచి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి పునర్జన్మ ఇస్తున్నారు. స్వచ్ఛంద రక్త దాతలు ముందుకు రాబట్టే ఎంతో మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. రహదారి ప్రమాదాలు.. చుట్టుముడుతున్న ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులు.. మరో పక్క వెంటాడుతున్న రక్తహీనత, తలసేమియా.. -
వైకాపాలో వణుకు!
[ 03-06-2024]
ఉద్యోగుల ఓట్లు అధికార వైకాపాలో వణుకు పుట్టిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో 17,289 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాటిలో అధిక శాతం అధికార పార్టీకి వ్యతిరేకంగా పడ్డాయన్న ప్రచారం నేపథ్యంలో లెక్కింపులో ఆ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. -
దిద్దుబాటు లేకుంటే కష్టమే!
[ 03-06-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం.. గొడవలు, ఘర్షణలకు దిగితే ఉపేక్షించేది లేదు.. అంటూ ఎన్నికల ముందు పోలీసు అధికారులు ఊదరగొట్టారు. తీరా ఎన్నికల బందోబస్తులో వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. -
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ కోరారు. కలెక్టరేట్లో ఆదివారం మధ్యాహ్నం ఎస్పీ అజితతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. -
మరికొద్ది గంటలు.. ఉత్కంఠే!
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ పూర్తయిన నాటి నుంచి అభ్యర్థులు, పార్టీల గెలుపు, ఓటములపై పందేల జోరు కొనసాగుతూనే ఉంది. -
రొయ్య.. ఉక్కిరిబిక్కిరి
[ 03-06-2024]
విభిన్న వాతావరణ పరిస్థితులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవలి వరకు అధిక ఉష్ణోగ్రతలతో పాటు రేయింబవళ్లు భరించలేని ఉక్కపోత కొనసాగింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆకాశం మేఘావృతమై.. మధ్య మధ్యలో కురుస్తున్న వర్షాలతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా పడిపోతోంది. -
పుస్తకాల పంపిణీకి వేళాయె..!
[ 03-06-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలనూ ఉచితంగానే సర్కారు అందిస్తోంది. కొన్నేళ్లుగా విద్యా శాఖ వైఫల్యంతో పుస్తకాలు అందించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
సేవలకు మంగళం!
[ 03-06-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో మీ-సేవ కేంద్రాలు నిర్వీర్యమై.. వీటిపై ఆధారపడ్డ వందలాది మంది ఉపాధి కోల్పోయారు. 2011లో ఏర్పాటుచేసిన వీటిని 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా కొనసాగించడంతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
సైనికుడి కుటుంబానికి సత్కారం
[ 03-06-2024]
వీర మరణం పొందిన 79వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సైనికుడు ఎం.సుధాకర్రావుకు నూజివీడు పట్టణం నెహ్రూపేట సామాజిక భవనంలో ఆదివారం సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. -
ధరావతు.. ప్రజాదరణకు గుర్తు!
[ 03-06-2024]
ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. గెలుపోటములపై అందరి దృష్టి ఉండగా, స్వతంత్రులు, చిన్నాచితకా పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం డిపాజిట్లు దక్కుతాయా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ-20 వరల్డ్ కప్.. క్రీడాభిమానులకు దూరదర్శన్ గుడ్న్యూస్
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. తెలంగాణ హైకోర్టులో సుమోటో విచారణ
-
ప్రైవేటు వ్యక్తుల వద్ద విత్తనాలు కొనొద్దు.. రైతులకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
-
పదో అంతస్తు పైనుంచి దూకి.. ఐఏఎస్ అధికారుల కుమార్తె ఆత్మహత్య
-
కౌంటింగ్ నేపథ్యం.. చంద్రబాబు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM