ఇస్తారా..చేతులెత్తేస్తారా!
వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు.
మండలాలకు మూడో వంతు సైతం చేరని పుస్తకాలు
కాలయాపనపై విద్యార్థుల తల్లిదండ్రుల అసంతృప్తి
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తిస్థాయిలో అందజేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గతేడాది సైతం కొన్ని తరగతులకు శత శాతం పుస్తకాలు అందజేయలేదు. సార్వత్రిక ఎన్నికల పేరిట ఈ సంవత్సరమూ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాడేపల్లిగూడెంలోని పుస్తక పంపిణీ కేంద్రం నుంచి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ఆయా మండలాల్లోని విద్యాశాఖాధికారి కార్యాలయాలకు చేరవేస్తున్నట్లు అక్కడి యంత్రాంగం చెబుతోంది. ఇక 8, 9, 10వ తరగతుల పుస్తకాలు మాత్రం ముద్రణ కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకే చేరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మందకొడిగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాతోపాటు కృష్ణా నుంచి ఏలూరు జిల్లాలో చేరిన కైకలూరు, నూజివీడులోని అన్ని మండలాల పాఠశాలలకు తాడేపల్లిగూడెం పుస్తక పంపిణీ కేంద్రం నుంచే సరఫరా జరుగుతోంది. ఒకటి నుంచి 7వ తరగతుల వరకు ఇంకా 8,47,845 పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ జిల్లాలో పర్యటించడంతో ఉంగుటూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు మండలాలకు మాత్రం పుస్తకాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయడం గమనార్హం పదో తరగతికి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్నందున పుస్తకాలు అందుబాటులో లేకపోతే గందరగోళ పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడులు తెరిచే నాటికి పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం