నకిలీ శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడి
మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు.
మండవల్లి, న్యూస్టుడే: మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు. విజిలెన్స్ డీఎస్పీ సింగలూరి వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లోకుమూడిలో గ్రామానికి చెందిన కాగిత రామకృష్ణ అనధికారికంగా కొన్ని పెద్ద కంపెనీల బ్రాండ్లతో నకిలీ శీతల పానీయాల(కూల్డ్రింక్స్) తయారు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో కేంద్రంపై దాడులు నిర్వహించి సోదాలు చేశారు. కూల్డ్రింక్స్ తయారీకి కావాల్సిన రసాయన పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గడువు తీరిన శీతలపానీయాల సీసాలను గుర్తించి నమూనాలు సేకరించి ఆహార భద్రతా పరీక్షా కేంద్రాలకు పంపారు. ఈ కేంద్రానికి తూనికలు, కొలతల శాఖ అనుమతులు సైతం లేనట్లు గుర్తించారు. దీనిపై పలు సెక్షన్ల కింద యజమాని రామకృష్ణపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్సై జి.విల్సన్, ఫుడ్సేఫ్టీ అధికారి రామరాజు, తూనికలు కొలతల శాఖాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇనుప రాడ్లతో దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు
ముదినేపల్లి, న్యూస్టుడే: జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చేసిన వేడుకల్లో బాణసంచా పేలుళ్లు, బ్యానర్ కట్టడంపై ఏర్పడిన ఘర్షణ పెరిగి పెద్దదై ఇనుపరాడ్లతో దాడికి దారి తీసింది. ఈ ఘటన ముదినేపల్లి మండలం ఊటుకూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఊటుకూరుకు చెందిన జి.శ్రీనుబాబు తన స్నేహితులతో కలిసి ఈనెల 19 అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా బాణసంచా పేల్చారు. ఆ సమయంలో ఎదురుగా నివాసముంటున్న పోసిన బాలకోటయ్య బాణసంచా పేలుళ్లు, బ్యానర్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది. స్థానికులు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి పోసిన బాలకోటయ్య మరో ఆరుగురిని తీసుకుని శ్రీనుబాబు ఇంటికి వెళ్లాడు. ఇంటిలో నిద్రిస్తున్న శ్రీనుబాబుతో పాటు కుటుంబసభ్యులు శివాజీ, శ్రీనివాసరావు, మాణిక్యాలరావులపై కారం జల్లి ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని గుడివాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనుబాబు ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పద్మజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కైకలూరు రూరల్ సీఐ కృష్ణకుమార్ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు.
సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై కేసు
ఏలూరు నేర వార్తలు, న్యూస్టుడే: పోలీసుస్టేషన్లో ఓ వ్యక్తిని కొట్టారనే అభియోగంపై కోర్టు ఆదేశాల మేరకు సీఐ, ఇద్దరు ఎస్సైలు, అయిదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఏలూరు పాత బస్టాండులోని అప్పలరాజు హోటల్కు వెళ్లి భోజనం చేశారు. బిల్లు చెల్లించే విషయంలో ఇతనికి, హోటల్ నిర్వాహకులకు గొడవ జరిగింది. సీతయ్య టూటౌన్ పోలీసుస్టేషన్కు వచ్చి హోటల్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు గురించి స్టేషన్కు వెళ్లిన సమయంలో తనతో అప్పటి సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్బాబు దురుసుగా ప్రవర్తించారని, కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని సీతయ్య మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు. కమిషన్ సూచనల మేరకు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. విచారించిన మొబైల్ కోర్టు బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో త్రీటౌన్ సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై ప్రసాద్ అప్పట్లో టూటౌన్ సీఐగా పని చేసిన ఆదిప్రసాద్, ఎస్సైలు నాగబాబు, కిషోర్బాబు, కానిస్టేబుళ్లు వెంకట సత్యనారాయణ, రవికుమార్, శ్రీనివాసరావు, జీవరత్నం, రాజేష్లపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట