వచ్చింది పుస్తకాలే.. అదీ అరకొరే!
వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రిని అందజేస్తామంటూ ఏటా అధికారులు చెబుతూ ఉంటారు.
ఇతర వస్తువుల ఊసే లేదు
‘విద్యా కానుక’లు సకాలంలో అందేనా?
పాఠ్య పుస్తకాలు పరిశీలిస్తున్న సమగ్ర శిక్షా ఏపీసీ సోమశేఖర్
ఏలూరు విద్యా విభాగం, న్యూస్టుడే: వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రిని అందజేస్తామంటూ ఏటా అధికారులు చెబుతూ ఉంటారు. కానీ, పాఠశాలలు తెరిచే నాటికి కాదు కదా రెండు నెలలు ఆలస్యంగానైనా అందజేయలేకపోతుంటారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నూతన విద్యా సంవత్సరం (2024-25) జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడుల విద్యార్థులందరికీ ‘విద్యా కానుక’ పథకం ద్వారా 9 రకాల వస్తువులు పంపిణీ చేయాల్సి ఉంది. పాఠ్య, రాత పుస్తకాలు, ఒక జత బూట్లు, మూడు జతల ఏకరూప వస్త్రాలు, ఒక బెల్టు, ఒక స్కూలు బ్యాగు, రెండు జతల సాక్సులు, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ నిఘంటువులు, ఒక వర్క్ పుస్తకం చొప్పున ప్రతి విద్యార్థికి అందజేయాలి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు మాత్రమే జిల్లాకు సరఫరా అయ్యాయి. అవీ నామమాత్రంగానే.
ఎప్పుడు వస్తాయో తెలియదు
పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ఇంకా 18 రోజులే ఉంది. పాఠ్య పుస్తకాలు అరకొరగా సరఫరా కాగా.. మిగతా వస్తువుల్లో ఒక్కటీ జిల్లాకు చేరనే లేదు. ఒకటి నుంచి 7వ తరగతి పాఠ్య పుస్తకాల్ని ఆయా మండల స్టాక్ పాయింట్లకు చేర్చి అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది. 8, 9, 10 తరగతుల పుస్తకాలను నేరుగా ప్రచురణకర్త నుంచి అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమగ్ర శిక్షా అధికారులు చెబుతున్నారు. బూట్లు, ఏకరూప దుస్తులు, బెల్టులు, స్కూలు బ్యాగులు, రాత పుస్తకాలు, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్, 1వ తరగతి వారికి పిక్టోరియల్ నిఘంటువులు అందజేయాల్సి ఉంటుంది. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్క్ బుక్లు పంపిణీ చేయాలి.
నెలాఖరుకల్లా ..
విద్యా కానుకలు ఈ నెలాఖరుకల్లా జిల్లాకు వస్తాయని సమగ్ర శిక్షా సీఎంవో రవీంద్ర తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాత పుస్తకాలు వస్తాయని, మిగతా వస్తువులు తర్వాత చేరతాయన్నారు. ఎన్నికల నియమావళి తదితర కారణాలతో ఈ ఏడాది విద్యార్థులకు వస్తువులు పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. పాఠశాలలు తెరిచే నాటికల్లా అందజేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్