రథం కదలగా.. భక్తజనం మురవగా!
కాళ్లకూరు క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు.
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణోత్సవం
కాళ్ల: రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
కాళ్ల, న్యూస్టుడే: కాళ్లకూరు క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. జిల్లా దేవాదాయ శాఖాధికారి సుబ్బారావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆపై ప్రధాన వీధుల్లో గోవింద నామస్మరణ నడుమ భక్తులు రథం లాగి మురిసిపోయారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం.అరుణ్కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.
చెన్నకేశవస్వామి ఆలయంలో..
ఉండి, న్యూస్టుడే: ఉప్పులూరులో కొలువైన చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథం లాగి మొక్కులు తీర్చుకున్నారు.
రాజమన్నార్గా శ్రీనివాసుడు!
ద్వారకాతిరుమల, న్యూస్టుడే: ద్వారకాతిరుమల శేషాచలంపై వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. దీనిలో భాగంగా గురువారం రాజమన్నార్ అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.
కల్యాణోత్సవాల్లో ఈనాడు..
- ఉదయం 10.30గంటలకు చక్రవారి-అవభృథోత్సవం.
- మధ్యాహ్నం 3గంటలకు వేద సదస్సు
- రాత్రి 7గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ
- రాత్రి 8కి అశ్వవాహనంపై గ్రామోత్సవం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ