ఊరూరా జూదాల జాతర.. దీపం ఉండగానే చక్కబెట్టేస్తున్నారు
ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జూదాలు జోరందుకున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం ఈవీఎంల దగ్గర ఉన్నామని.. ఇంటింటా తనిఖీలు చేస్తున్నామని చేతులెత్తేస్తోంది.
కొన్నిచోట్ల అధికారుల కనుసన్నల్లో..
భీమవరం పట్టణం, ఆకివీడు, నరసాపురం, న్యూస్టుడే: ఉన్నతాధికారులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ జూదాలు జోరందుకున్నాయి. అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం ఈవీఎంల దగ్గర ఉన్నామని.. ఇంటింటా తనిఖీలు చేస్తున్నామని చేతులెత్తేస్తోంది. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో అధికారుల కనుసన్నల్లోనే జూదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల సందడి మొదలైన నాటి నుంచి జూదాల జోరు మొదలవగా పోలింగ్ తర్వాత మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాలొచ్చాక ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు.. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- తీర ప్రాంతంలో ఉన్న ఓ సర్కిల్ పరిధిలో జూదాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న ఓ పోలీసు అధికారికి ఇక్కడి జూదరులతో సత్సంబంధాలున్నాయి. దీంతో జూద శిబిరాలకు అనధికార అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.
- గోదావరి నది వెంబడి ఉన్న మండలంలో సంక్రాంతి రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి జూదగాళ్లను తీసుకొచ్చి సకల సదుపాయాల మధ్య జూదాలు ఆడించారు. మధ్యలో కొంత విరామం తరువాత సాధారణ జూదాలు కొనసాగిస్తున్నారు.
- ఏలూరు జిల్లాకు సరిహద్దులో ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న ఓ స్టేషన్ అధికారికి జూదాల నిర్వాహకులతో పాత పరిచయాలు ఎక్కువే. చెరువు గట్లపై విశ్రాంతి గదుల వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలు బారులు తీరి ఉంటాయంటే జూదాలు ఏ స్థాయిలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.
- జాతీయ రహదారిని ఆనుకొని పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతున్న ప్రాంతంలో గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో కోడిపందేలు, జూదాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి పందెగాళ్లు కార్లలో వస్తున్నారు. వేసవి విడిదికి ప్రత్యేకంగా విశ్రాంత గదులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
- పశ్చిమలో జిల్లా కేంద్రానికి సమీపాన ఓ స్టేషన్ పరిధిలో జూదాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ముడుపుల మత్తులో అధికారులెవరూ ఆ శిబిరాల దరిదాపుల్లోకి వెళ్లరు. మండలాల సరిహద్దు ప్రాంతాలు ఇటీవల జూదాలకు వేదికలయ్యాయి.
వేరే విధుల్లో ఉన్నారులే..
కొన్ని స్టేషన్ల పరిధిలో కొన్ని నెలలుగా జూదాలకు సంబంధించి కేసులు నమోదు అంతంత మాత్రంగా ఉంది. అధికారుల ప్రమేయమే దీనికి కారణం. మా వాళ్లంతా వేరే విధుల్లో ఉంటారు. మీరు ఆడుకునే ప్రాంతాలకు మనోడ్ని విధులకు పంపిస్తా.. ఉన్నతాధికారులు వస్తే సమాచారం ఇస్తాడు.. జాగ్రత్తగా ఆడుకోండి.. అంటూ నిర్వాహకులకు వాట్సప్ ద్వారా సమాచారం ఇస్తారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జూద శిబిరాల్లో రోజూ రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. అంటే చూసీ చూడనట్లు వ్యవహరించే వారికి పెద్ద మొత్తంలో నజరానా అందిస్తారన్నమాట.
మొక్కుబడి చర్యలతో సరి..
ఈ స్థాయిలో జూదాలు జరుగుతున్నప్పుడు అసలు కేసులే లేవంటే పైస్థాయి అధికారులకు అనుమానం వస్తుందనే భయంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని మమ అనిపిస్తారు. అలాంటప్పుడు కూడా నగదు ఎలా అందుకోవాలో తెలిసిన సిద్ధహస్తులున్నారు. జిల్లా కేంద్రానికి సమీపాన ఓ చోట జూదాల్లో పట్టుబడిన వారిలో పెద్దలను ముందే తప్పించేశారు. 15 నుంచి 20 మంది పట్టుబడితే అయిదారుగురి పేర్లు మాత్రమే ఫిర్యాదులో చేర్చారన్న ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక రేవుల్లో నిద్దరోతున్న నిఘా!
[ 16-06-2024]
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లాలో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఇతర జిల్లా అధికారులు, పశ్చిమలో మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక రేవుల పర్యవేక్షణకు వచ్చారు -
చెర వీడుతోంది.. పోలవరం ప్రాజెక్టు పరిసరాలు శుభ్రం
[ 16-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టులో 2016 నుంచి 2019 వరకు ఆవిష్కరించిన శిలాఫలకాలకు మెరుగులు అద్దే పనుల్లో జల వనరుల శాఖాధికారులు నిమగ్నం అయ్యారు. -
నాన్న మాట.. గెలుపు బాట!
[ 16-06-2024]
భీమవరం అర్బన్, కలిదిండి, ఉంగుటూరు, న్యూస్టుడే: బిడ్డను తనకంటే ఎత్తున నిలిపేందుకు జీవితాంతం పోరాడే అలుపెరుగని యోధుడు నాన్న. -
జన హితం..సంక్షేమ సంతకం
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు. -
పెనుగాలుల బీభత్సం
[ 16-06-2024]
పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
బుక్కెడు బువ్వకు భరోసా!
[ 16-06-2024]
అన్నార్తులు, పేదల క్షుద్బాధ తీరనుంది. మూడు పూటలా కడుపు నిండా ఆహారం అందనుంది. వైకాపా పాలనలో మూతపడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పేదలకు మరింత చేయూత
[ 16-06-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే సామాజిక పింఛన్ల సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దస్త్రంపై సంతకం చేశారు. -
8న మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం
[ 16-06-2024]
నరసాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలాల పరిధిలోని మాధవాయపాలెం ఫెర్రీ రేవు వేలం నిర్వహణకు సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై