ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: నాదెండ్ల
వైకాపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఈ నెల 28న జనసేన, తెదేపా ఉమ్మడిగా నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు.
మాట్లాడుతున్న జనసేన నేత మనోహర్. హాజరైన నాయకులు
పెంటపాడు, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఈ నెల 28న జనసేన, తెదేపా ఉమ్మడిగా నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో దిగిపోయే సీఎం జగన్మోహన్రెడ్డి రూ.25 కోట్ల ప్రజాధనంతో రెండు హెలికాప్టర్లు తీసుకోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఏ రకం భద్రతా కారణాలతో ఇబ్బందులు పడుతున్నారో.. ఎందుకు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడులో ఆరు లక్షల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి 250 మంది చొప్పున మొత్తం 500 మంది ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సభకు వచ్చే వారికి పార్కింగ్, ఇతర ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. సభకు రాష్ట్ర ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పొత్తులో ఎలా ముందుకు వెళ్తామనే అంశాన్ని అధినేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు వివరిస్తారని వెల్లడించారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, విడివాడ రామచంద్రరావు, పత్సమట్ల ధర్మరాజు, బీవీఎస్ఎన్ ప్రసాద్, కనకరాజు సూరి, రెడ్డి అప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, చేగొండి సూర్యప్రకాష్, సజ్జా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్