ఆరోగ్య సురక్షకు.. బకాయిల భారం
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో మొదటి విడత మొత్తం 956 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు.
కొండంత ఖర్చుకు గోరంత మంజూరు
గగ్గోలు పెడుతున్న నిర్వాహకులు
చేబ్రోలులో వైద్య శిబిరం
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో మొదటి విడత మొత్తం 956 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో విడతలో 411 శిబిరాలు ఏర్పాటు చేశారు. మొదటి విడత వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమంలా ఆర్భాటం చేయడంతో ఖర్చు తడిసిమోపెడైంది. టెంట్లు, మైకు సెట్లు, కుర్చీలు, టేబుళ్లు, విద్యుత్తు సౌకర్యం, అల్పాహారం, టీలు, భోజనాలు, బ్లీచింగ్, ముగ్గు, క్లీనింగ్, సామగ్రి, రవాణా కూలీల ఖర్చులన్నీ కలిపి రూ.50 వేల వరకు ఖర్చయింది.
- టి.నరసాపురం మండలంలోని 15 గ్రామాల్లో మొదటి విడత ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. ఒక్కో గ్రామంలో శిబిరం నిర్వహణకు రూ.50 వేల వరకు ఖర్చవగా.. రూ.30 వేలు మాత్రమే జమ చేశారు. మిగిలిన బిల్లుల గురించి అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కొందరు సర్పంచులు, కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.
- జంగారెడ్డిగూడెం పట్టణంలో మొదటి విడతలో అయిదు శిబిరాలు నిర్వహించారు. ఒక్కో దానికి రూ.60 వేల చొప్పున రూ.3 లక్షలు ఖర్చయింది. బిల్లులు పెట్టి నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో డబ్బు ఖర్చు చేసిన వారు లబోదిబోమంటున్నారు. రెండో విడత 8 శిబిరాలు ఏర్పాటుచేశారు. ఒక్కో శిబిరానికి రూ.40 వేల వరకు ఖర్చు చేయగా ఇప్పటివరకు నగదు ఊసే లేదు.
- ఉండి మండలంలోని ఓ పంచాయతీలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడత రూ.30 వేలు, రెండో విడత రూ.25 వేల చొప్పున రూ.55 వేలు ఖర్చు చేయగా ఇప్పటి వరకు జమ కాలేదు.
- ఆచంట మండల కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన శిబిరానికి రూ.25 వేలు ఖర్చు కాగా రూ.10 వేలే ఇస్తామని అధికారులు చెబుతున్నారని నిర్వాహకుడు వాపోయారు. ఆ రూ.10 వేలు కూడా ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనాడు, ఏలూరు: వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వాహకులకు తలకు మించిన భారంగా మారింది. తొలి విడత వైకాపా నాయకులు ఆర్భాటం చేసి నిర్వహణ భారాన్ని సర్పంచులు, గ్రామ కార్యదర్శులపై మోపారు. బిల్లులు పెట్టి నెలలు గడుస్తున్నా చాలామందికి ఎదురుచూపులు తప్పడం లేదు. జమ చేసినా కొండంత ఖర్చుకు.. గోరంత ఇవ్వడంతో నిర్వాహకుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. బిల్లుల గురించి అధికారులను అడుగుతున్నా పట్టించుకోవడం లేదని వారంటున్నారు.
మొదటి విడతకే దిక్కు లేదు
ప్రభుత్వం మొత్తం ఖర్చులు జమ చేస్తుందని నిర్వాహకులు భావించారు. ఇదంతా జరిగి మూడు, నాలుగు నెలలు గడుస్తున్నా చాలా గ్రామాల్లో మొదటి విడత బిల్లులే మంజూరు కాలేదు. ఆ విడతలో నిర్వాహకులు సగటున రూ.3.8 కోట్ల వరకు ఖర్చు చేయగా ఇప్పటి వరకు 30 శాతం బిల్లులు కూడా మంజూరుకాలేదు. ఇచ్చిన వారికి సైతం అయిన ఖర్చుకు.. జమ చేస్తున్న మొత్తానికి పొంతన లేదు.
చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని అయిదు సచివాలయాల్లో ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.40 వేల వరకు ఖర్చు కాగా.. రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన మొత్తం గురించి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉంగుటూరు మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో మొదటి విడత శిబిరానికి రూ.50 వేలు ఖర్చు చేశారు. ఖాతాలో రూ.30 వేలు మాత్రమే జమచేశారు. రెండో విడతలో రూ.30 వేలు ఖర్చవగా ఇప్పటివరకు పైసా కూడా జమ కాలేదు. అప్పులు తెచ్చి ఖర్చు పెట్టిన చాలామంది సర్పంచులు, కార్యదర్శులు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ అంశమై నోడల్ అధికారి పూర్ణచంద్రరావును వివరణ కోరగా బిల్లులు సంబంధిత విభాగాలు పంపించామని, త్వరలో జమవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్