logo

‘ఈనాడు - ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య సదస్సు, ఓటుహక్కు నమోదు

అర్హత ఉండి తాజాగా విడుదలైన ఓటరు తుది జాబితాలో మీ పేరు లేదా? 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కు లేదా? అలాంటి వారికి ‘ఈనాడు- ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ ’ అవకాశం కల్పిస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాయి.

Published : 24 Feb 2024 03:49 IST

అర్హత ఉండి తాజాగా విడుదలైన ఓటరు తుది జాబితాలో మీ పేరు లేదా? 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కు లేదా? అలాంటి వారికి ‘ఈనాడు- ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ ’ అవకాశం కల్పిస్తూ ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాయి. అర్హులు ఎవరైనా కార్యక్రమానికి హాజరుకావచ్చు. ఓటు హక్కు నమోదు, వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు సందేహాలు నివృత్తి చేస్తారు. సదస్సు ముగిశాక అక్కడికక్కడే ఓటు నమోదుకు దరఖాస్తు చేయిస్తారు. ఓటు మీ హక్కు, మీ ఆయుధం. రండి.. ఓటు విలువ తెలుసుకోండి. ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి.

కావాల్సిన పత్రాలు: పాస్‌పోర్ట్‌  సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలు

తేదీ:   ఫిబ్రవరి 24, శనివారం ఉదయం 11 గంటల నుంచి
వేదిక:  శ్రీ వాసవీ జూనియర్‌, డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని