చంద్రన్న వడ్డిస్తే.. జగనన్న లాగేశాడు..
తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.5కే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారం అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 క్యాంటీన్లు కిటకిటలాడేవి. నిత్యం 15,500 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేవారు.
నాడు పేదల కడుపు నింపిన అన్న క్యాంటీన్లు
తొలగించి పగ సాధించిన వైకాపా సర్కారు
తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.5కే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారం అందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 క్యాంటీన్లు కిటకిటలాడేవి. నిత్యం 15,500 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే కూలీలు, ఆసుపత్రులు, ఇతరత్రా అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చేవారికి రూ.5కే నాణ్యమైన ఆహారం దొరికేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ఎత్తేసింది. ఇప్పుడు రూ.100- రూ.120 పెడితేగానీ ఆకలి తీరని పరిస్థితి నెలకొంది.
అన్న క్యాంటీన్లు మూసేసి పేదల నోటి కాడ కూడు లాగేసిన వైకాపా ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో ‘ఆహా’ పేరిట స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఆహార శాలలను ఆర్భాటంగా ప్రారంభించింది. వీటి వైభవం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. క్రమంగా ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. వీటికి సంబంధించిన టెంట్లు తుపాను గాలికి ఎగిరిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వీటివల్ల పేదల ఆకలి తీరకపోయినా పెద్దోళ్లకు మాత్రం దండిగా సొమ్ములు ముట్టాయనే విమర్శలున్నాయి.
భీమవరం పట్టణం, న్యూస్టుడే: దాతృత్వానికి పురిటిగడ్డ గోదావరి డెల్టా. నోరు తెరిచి అడగకపోయినా ఆప్యాయ ంగా వడ్డించి ఆకలి తీర్చే మనసున్న మనుషులు గోదారి వాసులు. అందుకే గోదావరి జిల్లాలకు దేశ విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు. ఇలాంటి సంస్కృతిని ప్రతిబింబించేలా కేవలం రూ.5కే పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కూలీలు, నిరుపేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని ఉపయోగించుకొనేవారు.
అయిదేళ్ల కిందట భీమవరంలో వేలాది మందికి ఆహారం అందించిన అన్న క్యాంటీన్ భవనం ఇది. నిర్వహణ లేక ఇలా పాడుబడినట్లు దర్శనమిస్తోంది. వైకాపా పాలకులు ఈ భవనాల్లో చాలా వరకు వార్డు సచివాలయాలకు కేటాయించారు. కనీస మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది.
ఆహా.. అంటూ రోజుల వ్యవధిలోనే..
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగ మేఘాలపై అన్న క్యాంటీన్లను మూసేశారు. వీటి కోసం నిర్మించిన భవనాల రంగులు మార్చేసి సచివాలయాలు, ఇతరత్రా అవసరాలకు కేటాయించారు. అప్పటి నుంచి వాటికి కనీస మరమ్మతులు లేవు. మరోపక్క అద్భుతమైన ఆహారం అందిస్తామంటూ తెరిచిన ఆహా క్యాంటీన్లను రోజుల వ్యవధిలోనే మూసేశారు.
రూ.5కే రుచిగా.. శుచిగా
అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించారు. అప్పట్లో మూడుపూటలకు కలిపి మొత్తం రూ.73 వ్యయం కాగా పేదలపై భారం పడకుండా రూ.15 మాత్రమే వసూలు చేశారు. మిగిలిన రూ.58 రాయితీగా ప్రభుత్వం సమకూర్చింది. బీ మధ్యాహ్నం, రాత్రి భోజనంలో 400 గ్రాముల అన్నంతో పాటు పప్పు, సాంబారు, కూర, పెరుగు, చట్నీ అందించారు. ఉదయం అల్పాహారంలోనూ మెనూ ప్రకారం రకరకాలు రుచులు వడ్డించారు.
జిల్లాలో మొత్తం క్యాంటీన్లు 22
నిత్యం అల్పాహారం, భోజనం తినేవారు 15,500
సద్వినియోగం చేసుకున్నవారు 1,30,20,000
వెచ్చించిన వ్యయం సుమారుగా రూ.65.10 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు