ఘనంగా జ్యోతిబా ఫులే విగ్రహావిష్కరణ
మూఢ విశ్వాసాలు, అంటరానితనంపై ప్రజలను చైతన్యపరిచి విజ్ఞానం వైపు నడిపించిన మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శప్రాయులని బహుజన సేన, బీసీ సంఘాల నాయకుడు శ్రీచందు, మోడెం రాజశేఖర్ అన్నారు.
మదనపల్లె పట్టణం, న్యూస్టుడే : మూఢ విశ్వాసాలు, అంటరానితనంపై ప్రజలను చైతన్యపరిచి విజ్ఞానం వైపు నడిపించిన మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శప్రాయులని బహుజన సేన, బీసీ సంఘాల నాయకుడు శ్రీచందు, మోడెం రాజశేఖర్ అన్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె మార్కెట్ యార్డు వద్ద జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని ఎదిరించి స్త్రీలకు విద్యనందించిన విద్యాదాతగా కొనియాడారు. తన భార్యను ఉపాధ్యాయురాలిగా చేసి దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని అందించారన్నారు. స్త్రీలు చదువుకోవడానికి వీలుగా రాత్రి పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధించారన్నారు. ఇలాంటి మహనీయుని విగ్రహాన్ని నేడు మదనపల్లె ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రెడ్డెప్ప, రమేష్యాదవ్, పులి శ్రీనివాసులు, గోవిందు, ప్రసాద్, నాగరాజు, సోము, డి.వి.రమణ, బహుజనసేన ఉద్యోగుల సంఘం నాయకుడు చెన్నకేశవులు, రాయల్బాబు, చిట్టిబాబు, కె.ఆనంద్,రాఘవేంద్ర, రూపక్నాయక్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాయచోటి : అణగారిన వర్గాల వారి కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫులే అని డీఆర్వో సత్యనారాయణరావు పేర్కొన్నారు. కలెక్టరేట్లో గురువారం ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచారన్నారు. పట్టణంలోని దిగువ పెట్రోలు బంకు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఫులే విగ్రహానికి బీసీ సంఘం జాతీయ నాయకుడు వండాడి వెంకటేశ్వర్లు, రవిరాజు, మున్సిపల్ కమిషనర్ వాసుబాబులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్