వైకాపా నేతలు బాహుదాను కొల్లగొట్టేశారు: నల్లారి
పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, కలికిరి, కలకడ మండలాల్లో ప్రవహిస్తున్న బాహుదా నదిని అయిదేళ్లపాటు వైకాపా నేతలు కొల్లగొట్టారని, పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించి రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆరోపించారు.
కలికిరి గ్రామీణ, న్యూస్టుడే: పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, కలికిరి, కలకడ మండలాల్లో ప్రవహిస్తున్న బాహుదా నదిని అయిదేళ్లపాటు వైకాపా నేతలు కొల్లగొట్టారని, పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించి రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆరోపించారు. కలికిరి మండలం నగరిపల్లెలో గురువారం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైకాపా నాయకులు దోచుకున్న డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీలేరు శివార్లలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వైకాపా నాయకులు వెంచర్లు వేసి అమ్ముకున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తన సోదరుడు నల్లారి కిరణ్కుమార్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పీలేరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా నాయకులు చేసిందేమీలేదని పేర్కొన్నారు. వైకాపా పాలనలో నాసిరకం మద్యం, ఇసుక అక్రమ రవాణా, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అరచకాలే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనవెంట నాయకులు రఘురామిరెడ్డి, ప్రతాప్కుమార్రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్