logo

దోచుకోవడం... దాచుకోవడమే వైకాపా నైజం

దోచుకోవడం...దాచుకోవడమే వైకాపా నైజమని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 13 Apr 2024 02:59 IST

రాజంపేట, న్యూస్‌టుడే: దోచుకోవడం...దాచుకోవడమే వైకాపా నైజమని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా శుక్రవారం తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లారి మాట్లాడుతూ అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయినా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నిస్తున్న నాయకులపై వైకాపా ప్రభుత్వం కేసులు బనాయించి దాడులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాల పునర్విభజనతో రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబుతో మాట్లాడతానని, న్యాయం జరిగేవిధంగా చూస్తానని తెలిపారు. సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, తెదేపా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, నాయకులు రామచంద్రయ్య, వేమన సతీష్‌, యల్లటూరి శ్రీనివాసరాజు, నాగోతు రమేష్‌నాయుడు, డాక్టర్‌ సి.సుధాకర్‌, పోతుగుంట రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని