బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్ట పరిపాలన భవనంలో శుక్రవారం తితిదే, జిల్లా అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 16న ఉత్సవాలకు అంకురార్పణ, 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రాములోరి పరిణయ వేడుకలను నేత్రపర్వంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కలెక్టరు విజయరామరాజు మాట్లాడుతూ ఈ నెల 15 లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు.పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో ప్రభాకర్రెడ్డిని, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణను ఆదేశించారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, జేసీ గణేష్కుమార్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, సీఈ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్కుమార్, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సుమతి, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్రెడ్డి, నటేష్బాబు, ప్రశాంతి, ఈఈ సుమతి, డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!