బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు.
స్వామి వారిని అభిషేకిస్తున్న అర్చకులు
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. కోదండరాముడు వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్బాబు ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం ఘట్టం కనులపండువగా జరిగింది. భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాట నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆలయంలో ఉదయం 11 గంటల నుంచి సీతారామలక్ష్మణమూర్తులకు స్నపవ తిరుమంజనం వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి దివ్యానుభూతి పొందారు.డీఎఫ్వో శ్రీనివాసులు, పర్యవేక్షకుడు హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్కుమార్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 7.30కు జగదభిరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు సింహ వాహనంపై సీతారామలక్ష్మణమూర్తులు విహరిస్తారు.
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల తయారీ పూర్తి
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అవసరమైన ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ పూర్తయింది. ఈ నెల 22న రాత్రి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు వీటిని పంపిణీ చేయనున్నారు. సుమారు లక్ష ప్యాకెట్లు సిద్ధం చేశారు. జానకీరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పవిత్రమైన ముత్యాల తలంబ్రాలతోపాటు తిరుమల శ్రీవారి చిన్న (25 గ్రాములు) లడ్డూలు అందజేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కనుల పండువగా ఊంజల్ సేవ
ఏకశిలానగరి కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఊంజల్సేవ భక్తులను ఆనందభరితులను చేసింది. రామయ్య క్షేత్రంలో ఉన్న కల్యాణ మండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి డోలికల్లో కూర్చోబెట్టి ఊంజల్ సేవ చేశారు. చెన్నైకు చెందిన శృతి... భక్తి గీతాలను, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?