పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్డీఏ కూటమిదే అధికారం
మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి
ర్యాలీలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పక్కన కిశోర్కుమార్రెడ్డి, నాయకులు
పీలేరు గ్రామీణ, న్యూస్టుడే : రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గురువారం పీలేరులో ఆయన సోదరుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ర్యాలీ, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. తాను అడిగిన పదవులు ఏవీ తనకు రాలేదన్నారు. మంత్రి పదవి అడిగాను రాలేదు. అగడకుండా చీఫ్విప్, స్పీకర్, సీఎం పదవులు వచ్చాయని, ఎంపీ కావాలని తాను అడగలేదని భాజపా అధినాయకత్వం, చంద్రబాబు, పవన్కల్యాణ్ సహకారంతో ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు. ఎన్డీఏకు 350 పైచిలుకు ఎంపీ సీట్లు వస్తాయని అందులో తాను ఎంపీగా ఉంటానని ఆయన జోస్యం చెప్పారు. అధికారం చేపట్టగానే ఏపీకి రావాల్సిన నిధులను తెప్పించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి హాదాలో నేషనల్ మ్యానిఫాక్చరింగ్ జోన్ కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి భూ సేకరణ చేసి 10 ఏళ్ల కిందట బిల్ పాస్ చేయించామని ఆయన చెప్పారు. దీంతో రూ.30 వేల కోట్లతో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పార్లమెంటులో ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. వైకాపా అధికారంలో స్థానిక సంస్థలు, సర్పంచుల ఎన్నికలు లేకుండా చేశారనీ, 30 వేల దొంగ ఓట్లు సృష్టించి ఐఏఎస్లను ఇంటికి పంపిన ఘనత వైకాపా నాయకులకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి వారిని తిరిగి ఎన్నుకుంటే మనకే చేటన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి