మరో వైకాపా ఫ్యానుపై వేటు
వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు.
జిల్లా మూలాలే వెంకట్రామిరెడ్డిపై వేటుకు కారణం
ఇటీవల మైదుకూరు ఆర్టీసీ డిపోలో అధికారులతో మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి
ఈనాడు, కడప: వృత్తి ఉద్యోగమైనా... నిబంధనలు ఉల్లంఘించి అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి జగన్కు ఊడిగం చేసే వారికి తగిన శాస్తి జరుగుతుందనడానికి నిదర్శనమే... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు. పులివెందులకు చెందిన వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైకాపాతో అంటకాగుతున్నారు. పంచాయతీరాజ్శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన జిల్లాలో తరచూ వైకాపా కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ మేరకు ఇటీవల వైకాపా తరపున బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేపడుతూ కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు. వైకాపాకు ఓటెయ్యాలంటూ అభ్యర్థించారు. ఇతర ఉద్యోగ సంఘాలతోనూ సమావేశమై అందరూ వైకాపాకు పని చేయాలంటూ ఒకింత బెదిరింపు ధోరణితో ఒత్తిడి తెచ్చారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ఎన్నికల సంఘం జిల్లా కలెక్టరు విజయరామరాజు ద్వారా నివేదిక తెప్పించుకున్న ఎన్నికల సంఘం వాస్తవాలను గుర్తించి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన జిల్లా ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాశమైంది. వైకాపా నేతలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. నిబంధనల ఉల్లంఘనతో బరితెగింపు ధోరణితో వ్యవహరించే వారికి ఇలాంటి శాస్తే జరుగుతుందంటూ వ్యాఖ్యలు వినిపించాయి. ఈ తరహాలో మరికొందరిపై విచారణ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల