భూసంస్కరణల అమలుతోనే వ్యవసాయ కార్మికుల పురోభివృద్ధి
దేశవ్యాప్తంగా భూసంస్కరణలు పక్కాగా అమలు చేసినప్పుడే వ్యవసాయ కార్మికుల జీవితాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్సింగ్ వెల్లడించారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్సింగ్
బి.కొత్తకోట, న్యూస్టుడే: దేశవ్యాప్తంగా భూసంస్కరణలు పక్కాగా అమలు చేసినప్పుడే వ్యవసాయ కార్మికుల జీవితాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్సింగ్ వెల్లడించారు. బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్లోని ప్రైవేటు అతిథి గృహ ప్రాంగణంలో రెండో రోజైన శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా విక్రమ్సింగ్ మాట్లాడుతూ... వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పోరేట్ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భాజపా విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు బలోపేతమవుతున్నాయని, దీని కోసం తమ వంతు కృషి చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉపాధి కార్మికులు పనులు చేస్తున్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని నాయుకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టజీవుల సమస్యలను పరిష్కరించడం కోసం అవసరమైతే స్థానికంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు, శ్రీనివాసులు, రవి, నారాయణ, పుల్లయ్య, అన్వేష్, ఓబులరాజు, పెద్దన్న, కృష్ణమూర్తిలు ఇందులో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
[ 27-07-2024]
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
కాలిబాటతో దోమపోటు నివారణ
[ 27-07-2024]
వరిలో కాలిబాటలతో దోమపోటు నివారించవచ్చని వీఏఏ గురులక్ష్మి తెలిపారు. -
కలసపాడులో చండీ హోమం
[ 27-07-2024]
మండల కేంద్రంలోని శ్రీ అంకాలమ్మ తిరుణాల సందర్భంగా శనివారం చండీ హోమం నిర్వహించారు. -
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ