అడుగంటిన నీళ్లు... అన్నదాతలకు కన్నీళ్లు
ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందిస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు.
ఇదీ బ్రహ్మంసాగర్ జలాశయం పరిస్థితి
న్యూస్టుడే, బద్వేలు
ప్రాజెక్టులు, కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరందిస్తామన్న హామీని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో బద్వేలు నియోజకవర్గం పరిధిలోని బ్రహ్మంసాగర్ జలాశయంలో నీరు అడుగంటిపోయింది. ఇందులోకి నీరు నింపడంలో పాలకులు చర్యలు చేపట్టకపోవడంతో ఖరీఫ్లో పొలాలకు సాగునీరందే పరిస్థితి లేకుండాపోయింది. జలాశయం నిత్యం నిండు కుండలా ఉండేవిధంగా 17 టీఎంసీల నీటిని నింపుతామన్న హామీని ప్రభుత్వం విస్మరించడంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన సీఎం జగన్ బ్రహ్మంసాగర్ జలాశయంలోకి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని నింపుతామన్నారు. నియోజకవర్గంలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండలాల్లో కరవు పీడిత రైతాంగానికి సాగునీరందిస్తామని అర్భాటంగా ప్రకటించారు. దువ్వూరు మండలం కుందూ నదిపై రూ.400 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. ఇంతవరకు పనులు చేపట్టలేదు. వ్యవసాయ రంగానికి ఆధారమైన బ్రహ్మంసాగర్ జలాశయంలో పూర్తి స్థాయిలో 17 టీఎంసీల నీటిని నింపిందిలేదు. దీంతో జలాశయం కింద ఉన్న 90 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. గతేడాది వర్షాభావంతో జలాశయంలోకి కృష్ణా జలాలు రాలేదు. దీంతో రబీ, ఖరీఫ్లలో పంటలను సాగుచేసుకునే అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన కుడి, ఎడమ కాలువల కింద ఉన్న పంట కాలువలు పూర్తి కాలేదు. కొన్నిచోట్ల లైనింగ్ పనులు చేయలేదు. దీంతో నీరందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పర్యాయాలు పాలకులు, అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి ఆధారంగా ఉన్న జలాశయానికి నీరందించి రైతులకు శాశ్వత పరిష్కారం చూపడంతో వైకాపా ప్రభుత్వం విఫలం కావడంతో అన్నదాతలు పంటల సాగుకు దూరమయ్యారు.
పొలం బీడుగా వదిలేశాం
- శివారెడ్డి, రైతు, కోనసముద్రం
నాకు బ్రహ్మంసాగర్ జలాశయం కుడి కాలువ కింద అయిదు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు పంట కాలువను పూర్తి చేయకపోవడంతో అసంపూర్తిగా ఉంది. పదేళ్లుగా అనేక పర్యాయాలు తెలుగుగంగ ఇంజినీర్లు, పాలకుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందన లేదు. సాగునీరందకపోవడంతో పొలాన్ని బీడుగా వదిలేశాను.
ఆయకట్టుకు సాగునీరందించలేం
- సాయి, ఏఈ, బ్రహ్మంసాగర్ జలాశయం
బ్రహ్మంసాగర్ జలాశయంలో 17 టీఎంసీలకు ఒకటిన్నర టీఎంసీ మాత్రమే నీరు ఉంది. ఖరీఫ్లో ఆయకట్టు పొలాలకు సాగునీరందించలేం. గతేడాది వర్షాభావంతో జలాశయంలోకి కృష్ణ జలాలు రాలేదు. ఈ కారణంగా రైతాంగానికి సాగునీరందించలేకపోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల