చిన్న పిల్లాడికి పెద్ద కష్టం!
తమ పిల్లలు తోటివారితో ఆడుతూ పాడుతూ ఎదుగుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటుంటారు.
ఏడేళ్లుగా అంతుచిక్కని వ్యాధితో బాలుడికి నరకం
ప్రభుత్వ సాయానికి తల్లిదండ్రుల ఎదురుచూపులు
న్యూస్టుడే, బద్వేలు, గోపవరం
తమ పిల్లలు తోటివారితో ఆడుతూ పాడుతూ ఎదుగుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని ఎన్నో కలలు కంటుంటారు. అలాంటిది పుట్టినప్పటి నుంచి చిన్నారి అంతుచిక్కని వ్యాధితో నరకం అనుభవిస్తుండడం, తోటి పిల్లలు సైతం దగ్గరకు రానీయకపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో బాలుడి తల్లిదండ్రులు రూ.లక్షలు అప్పులు చేసి మరీ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ బాలుడే బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని త్యాగరాజు కాలనీకి చెందిన పీరయ్య కొండమ్మల కుమారుడు జనార్దన్ మురుగన్.
చిన్నారి మురుగన్కు ఏడేళ్ల వయసు. పుట్టుకతోనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. శరీరమంతటా మచ్చలుండడం, బిగుసుకుపోయి రక్తస్రావం కావడం, ఆయాసం, ఆహారం తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడం, కనీసం నడిచేందుకు శరీరం సహకరించకపోవడం, మాట స్పష్టత లేకపోవడం వంటి లక్షణాలు ఆ చిన్నారిని బాధిస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడుకునేందుకు పంపించాలన్నా చిన్నారి శరీర ఆకృతి చూసి తోటి పిల్లలు భయపడుతున్నారని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. తమ కుమారుడికి వచ్చిన వ్యాధిని నయం చేయించేందుకు ఏడేళ్లుగా వారు కలవని వైద్యుడు లేరు. తిరగని ఆసుపత్రి లేదు. తమిళనాడుతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. తమ బిడ్డకు వ్యాధిని నయం చేయించాలని తల్లిదండ్రులు ఉన్నందంతా ఆసుపత్రులకు ధారపోశారు. ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి చివరకు అప్పులపాలయ్యారు. కూలీనాలీ చేసుకుని బతికే తమకు బాలుడి సంరక్షణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడి పరిస్థితి చూస్తూ నిత్యం కన్నీటి పర్యంతమవుతున్నారు. వేసవిలో వ్యాధి తీవ్రంగా ఉంటుందని, శీతాకాలంలో కాస్త కుదుట పడుతుందని చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు రూ.7 వేలు వరకు మందులకు ఖర్చవుతోందని, ఇది ఆర్థికంగా బారంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కలత చెందుతున్నారు. పింఛను మంజూరు చేయాలని కలెక్టర్కు విన్నవించినా స్పందన లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం అందించి ఆదుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం