logo

వైభవంగా ప్రసన్న వెంకటేశ్వరస్వామికి చక్రస్నానం

మదనపల్లె పట్టణంలోని నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.

Published : 26 May 2024 04:01 IST

అశ్వవాహనంపై ఊరేగుతున్న శ్రీనివాసుడు

మదనపల్లె విద్యావిభాగం, న్యూస్‌టుడే : మదనపల్లె పట్టణంలోని నిర్వహిస్తున్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం భూదేవి, శ్రీదేవి సమేత స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగింపు, ధ్వజారోహణ కార్యక్రమం  నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్‌ పాండు, ఈవో రమణ, ప్రధాన అర్చకుడు గోవర్ధన్‌భట్టార్,  అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

స్వామివారికి చక్రస్నానం చేయిస్తున్న అర్చకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని