నారాపుర... పట్టించుకోరా?
జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2008 అక్టోబరు 23న తితిదేలోకి విలీనం చేశారు.
న్యూస్టుడే, జమ్మలమడుగు: జమ్మలమడుగులో నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2008 అక్టోబరు 23న తితిదేలోకి విలీనం చేశారు. ఆ తర్వాత సమస్యలు తీరలేదు. ఇక్కడ 36 మంది సిబ్బందికిగాను కేవలం తొమ్మిది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రసాదం తయారీలో ఒక్కరే ఉన్నారు. మరొకరు కావాలి. అదేవిధంగా కసువు శుభ్రం చేయడానికి మరో ఇద్దరు అవసరం ఉంది. మహిళా ఉద్యోగులు ఉన్నా అతివల కోసం ప్రత్యేకంగా శౌచావాలయం ఏర్పాటు చేయలేదు. తాగునీటి సమస్య నెలకొంది. చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో మందు బాబులకు అడ్డాగా మారింది. కోడి మాంసం వ్యర్థాలు, ఇతర చెత్తను సమీపంలో వేస్తున్నారు.
ఆలయంలో వెనుక వైపున జూదమాడుతున్నారు. గుడి ప్రాంగణం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ప్రైవేటు వాహనదారులు ఆలయ స్థలాన్ని పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. రెండేళ్లుగా నైవేద్యం తయారు చేయడానికి ఒక్కరే ఉన్నారు. ఆయన రాకపోతే ఆ రోజున శ్రీనివాసుడికి ప్రసాదం భాగ్యం ఉండదు. సెలవు రోజులు, శనివారం నాడు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందరికీ సరిపడేలా ప్రసాదాలు అందటం లేదు. ఆలయ ఆవరణలో తితిదే కల్యాణ మండపాన్ని 1988 మార్చి 20న ప్రారంభించారు. అప్పట్లో నామమాత్రం రుసుం వసూలు చేసేవారు. రానురాను నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. వంట గది, వధువు, వరుడికి కేటాయించే గదులు దెబ్బతిని కూలిపోయాయి. దాంతో మూసివేశారు. కల్యాణ మండపాన్ని పునర్నిర్మాణం చేస్తే పేద, మధ్య వర్గాలు శుభ కార్యాలు, పెళ్లిలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు