ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు
పదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం కొనసాగుతోంది.
లేకుంటే జరిమానా
వచ్చే నెల నుంచి ముమ్మర తనిఖీలు
న్యూస్టుడే, కడప చిన్నచౌకు
పదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధానం కొనసాగుతోంది. ఇటీవల కొత్త వాహనాలకే కాదు, పాత వాహనాలకు కూడా వీటిని బిగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం గడువు ఎప్పుడో ముగిసింది. అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండడంతో దీనిని కాస్త పక్కన పెట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తరవాత ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాహనదారులకు అవగాహన కల్పించి, తప్పనిసరిగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను బిగించుకునేలా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఇది లేకుంటే జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించుకోవాలంటే www.siam.in అనే వెబ్సైట్లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాలి. ఆ సమయంలో డీలర్ వద్ద లేదా ఇంటి వద్దకు వచ్చి బిగించుకుంటారా అనే ఆప్షన్ అడుగుతుంది. మనకు ఏది వీలుగా ఉంటుందో దానిని ఎంచుకోవచ్చు. ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619, భారీ వాహనాలకు రూ.649 చెల్లించాలి.
ఇవీ ప్రయోజనాలు
- హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ను ఎంబోజ్ అనే ముడి పదార్థంతో తయారు చేస్తారు. దీనిలో నాణ్యమైన హాలోగ్రామ్, లైజర్ నంబరు ఉంటుంది. నకిలీవి తయారు చేస్తే సులువుగా గుర్తించవచ్చు.
- హాట్ యంత్రం ద్వారా నంబర్ ప్లేట్లను తయారు చేస్తారు. ఇవి వర్షానికి, ఎండకు దెబ్బతినవు. నంబరు ప్లేట్లు మార్చి అక్రమంగా రవాణా చేసేందుకు అవకాశం ఉండదు.
వాహనాలకు రక్షణ కవచం
- మీరాప్రసాద్, డీటీసీ, కడప
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వాహనానికి రక్షణ కవచంలా పని చేస్తాయి. ఇప్పుడు కొత్త వాహనాలకు బిగిస్తున్నారు. పాతవాటికీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హడావుడిలో కొంత ఆలస్యమైంది. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత దీనిపై దృష్టిసారిస్తాం. నంబరు ప్లేట్లు లేకుంటే జరిమానాలు నమోదు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు