logo

భార్యను వేధించిన భర్త హతం

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది.

Published : 29 Nov 2023 02:29 IST

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పొత్తూరు నాగమునెయ్య (40), సంపూర్ణ దంపతులు మండల పరిధిలోని బలిజపల్లెలో నివాసం ఉండేవారు. నెల రోజుల కిందట సోమయాజులపల్లెకు మకాం మార్చారు. నాగమునెయ్య మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. గతంలో కూడా భార్యను నిప్పులతో కాల్చడంతో ఆమె కేసు పెట్టారు. ఇటీవలే ఆ కేసు కొట్టేశారు. సోమవారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించాడు. ఆమె లేదనడంతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. తనను ఎక్కడ చంపుతాడోనని భయాందోళన చెందిన సంపూర్ణ వేట కొడవలి లాక్కుని అతడి కాలుపై నరికింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగమునెయ్య తండ్రి ఫిర్యాదు మేరకు సంపూర్ణపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని