‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’
అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు
మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పక్కన నాయకులు
వీరపునాయునిపల్లె, న్యూస్టుడే : అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. సర్వరాయసాగర్ ఆనకట్టను బుధవారం ఆయన భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వరాయసాగర్ నీటిని సీఎం జగన్ తన సొంత సిమెంటు పరిశ్రమకు తరలించుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్ఎం కిసాన్ అనే ప్రైవేటు సంస్థకు కూడా నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్రెడ్డి చేపల చెరువుకు నీటిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీరందించకపోవడం విచారకరమన్నారు. రూ.52 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.215 కోట్లతో ప్రతిపాదనలు పంపారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడం అనే సిద్ధాంతంతో పాలన సాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట పార్టీ వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు శశిభూషన్రెడ్డి, నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పాలెం సురేష్కుమార్రెడ్డి, చంద్రమోహన్రెడ్డి, గవేశ్వరయాదవ్, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు