బీటెక్ రవిపై ఎందుకంత కోపం?
పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం.
అక్రమ కేసు.. అరెస్టు తదితర పరిణామాలన్నీ వివాదాస్పదమే
ఈనాడు, కడప, పులివెందుల, పులివెందుల గ్రామీణ, వేంపల్లె: పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. అలాంటిది పది నెలల కిందట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాక సందర్భంగా కడప విమానాశ్రయం వద్ద చోటుచేసుకున్న చిన్నపాటి ఘటనకు సంబంధించిన కేసులో బీటెక్ రవి అరెస్టు కావడంతో 15 రోజుల పాటు కడప కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. ఈయనకు సౌమ్యుడనే పేరుంది. పోలీసులు స్టేషన్కు రమ్మంటే వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తిని అకస్మాత్తుగా దారి మధ్యలో అదుపులోకి తీసుకోవడం, ఆయన నుంచి చరవాణులు స్వాధీనం చేసుకుని నిలిపేయడం, మూడు గంటల పాటు అటు.. ఇటు తిప్పడంతోపాటు చంపాలనే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో అధికార వైకాపాకు లేనంతగా తెదేపా కార్యాలయానికి అతి పెద్ద భవంతిని నిర్మించి ఇటీవల భారీ జనం మధ్య ప్రారంభించారు. ఈ భవనం విస్తృత ప్రచారంలోకి రావడం కీలక నేతలకు కంటగింపుగా మారిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెదేపా చరిత్రలోనే పులివెందులలో కొన్ని నెలల కింద జరిగిన తెదేపా అధినేత చంద్రబాబు సభకు భారీగా జనం తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జరిగాయి. పులివెందులలో సైతం మార్పు వస్తోందనే ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు అరెస్టు తరుణంలో దీక్షలు సైతం చేపట్టారు. పులివెందులకు చెందిన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ పరిణామాలన్నీ కీలక నేతలకు ఆగ్రహం తెప్పించిన క్రమంలోనే బీటెక్ రవి అరెస్టు వరకు వెళ్లిందనే ప్రచారం నడుస్తోంది. ఈయన అరెస్టుతో ఆయనపై సానుభూతి పెరగడం తప్ప సాధించింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషణ సాగుతోంది. ఈ విషయయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఓ పోలీసు అధికారి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారిపై పోరాడతామని హెచ్చరించారు. ఇలా బీటెక్ రవి అరెస్టుతో వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బెయిల్ మంజూరుతో సంబరాలు : బీటెక్ రవికి బెయిల్ మంజూరవ్వడంతో పులివెందుల, వేంపల్లెలో బుధవారం తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకొన్నారు. కడప కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక వాహనంలో పులివెందులకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేశారు. అనంతరం బాణసంచా పేల్చారు. కొందరు కార్యకర్తలు ఆయనను భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం