దొంగ ఓట్ల లెక్క తేల్చండి
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
కలెక్టర్ గిరీషకు తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి వినతిపత్రం
కలెక్టర్ గిరీషకు ఓటర్ల జాబితాలోని బోగస్, డబుల్ఎంట్రీ, మృతి చెందిన వారి వివరాలు అందజేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, నాయకులు
రాయచోటి, న్యూస్టుడే: ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు బోగస్, మృతిచెందిన, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నవారి వివరాలు అందజేశారు. జిల్లాలో జీరో డోరు నంబరుపై 2 వేలకుపైగా ఓట్లు ఉన్నాయని, సుమారు 11 వేల మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగించలేదని, 5 వేలకుపైగా డబుల్ ఎంట్రీ ఓట్లు, 15 వేలకుపైగా దొంగ ఓట్లు నమోదైనట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే విచారించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల ఓట్లు వివరాలు తెలిపినా బీఎల్వోలు మరణ ధ్రువపత్రాలు ఇవ్వాలని అడుగుతున్నారని, అవి తాము ఎలా ఇవ్వగలమని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల వివరాలు ఇస్తే విచారించి స్వచ్ఛమైన జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసినవారిలో మదనపల్లె, పీలేరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల నాయకులు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే