logo

అధికార దర్పం!

పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్‌ షఫీ తెలిపారు

Published : 30 Nov 2023 06:18 IST

పంచాయతీ కార్యాలయంలో వైకాపా కార్యక్రమం

 

పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్‌ షఫీ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని కార్యకర్తలకు  పలు సూచనలు చేయడం గమనార్హం. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండడాన్ని చిత్రంలో చూడొచ్చు.

 న్యూస్‌టుడే, పీలేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని