logo

ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు

ఒంటిమిట్ట మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తమను అగౌరవ పరిచారని సర్పంచులు ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

Published : 08 Dec 2023 16:09 IST

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తమను అగౌరవ పరిచారని సర్పంచులు ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సర్వసభ్య సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన దవంతరంపల్లి సర్పంచి లక్ష్మీనారయణ పట్ల మండల ఉపాధ్యక్షుడు జనార్ధన్‌ రెడ్డి, ఇన్‌ఛార్జి ఎంపీడీవో సోమశేఖర్‌ అనుచితంగా ప్రవర్తించి.. సమావేశం నుంచి వెళ్లిపోమని చెప్పడంతో సర్పంచులు బయటకు వచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత దవంతరంపల్లి, కొండమాచుపల్లి, సాలాబాదు సర్పంచులు లక్ష్మీ నారాయణ రెడ్డి, శివ నారాయణ, స్వర్ణలత ప్రధాన ద్వారం ముంగిట కూర్చొని నిరసన తెలిపారు. ఇన్‌ఛార్జి ఎంపిడీవోతో వాగ్వావాదానికి దిగారు. ఎంపీపీ లక్ష్మీదేవి స్థానంలో మండల ఉపాధ్యక్షుడిని ఎలా బాధ్యతలు అప్పజెప్తారని నిలదీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని