చిరునామాల తప్పు... వజ్రాయుధానికి ముప్పు!
పీలేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఓటర్ల జాబితా తీసుకున్నా అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.
అస్తవ్యస్తంగా ఓటర్ల తుది జాబితా
న్యూస్టుడే, పీలేరు, పీలేరు గ్రామీణ
పీలేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఓటర్ల జాబితా తీసుకున్నా అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. చిరునామాలు తప్పులతడకగా నమోదయ్యాయి. వీటిని ఎవరు పట్టించు కుంటారులే అనుకున్నారో ఏమో? ఇష్జారాజ్యంగా జాబితాలో నమోదు చేశారు. చిరునామా అని ఉన్నచోట ఇంటి సంఖ్య లేకుంటే జీరో అని, లేదా నోటికొచ్చిన సంఖ్యను ముద్రించి మమ అనిపించారు. పీలేరు పంచాయతీ 235వ పోలింగ్ కేంద్రంలో ఇలాంటి తప్పుడు ఇంటి సంఖ్యలతో ఆరుగురి ఓట్లు నమోదయ్యాయి. వీధి పేరు ఎక్కడా నమోదు చేయకుండా తుది ఓటర్ల జాబితాలో పేర్లు ముద్రించారు. పలుచోట్ల జీరో ఇంటి సంఖ్య చిరునామాతో అనేక ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి.
పీలేరు పంచాయతీలోని 235వ పోలింగ్ కేంద్రంలోని వరుస సంఖ్య 377లో ఎన్టీజీ-1437591 ఐడీతో నమోదైన లక్ష్మీదేవి ఓటు ఇదే కేంద్రంలోని వరుస సంఖ్య 372లో ఐడీ నెంబరు ఎన్జీటీ- 116699పైనా నమోదైంది. రెహానా పఠాన్ ఓటు ఎలాంటి వీధి పేరు లేకుండా తప్పుడు ఇంటి సంఖ్యతో నమోదైంది. వరుస సంఖ్య 371లో ఎన్జీటీ-1337252 ఐడీతో వెంకట నాగయ్య ఓటులో ఇంటి సంఖ్య తప్పుగా వచ్చింది. వరుస సంఖ్య 375లో ఎన్టీజీ-1233022 ఐడీతో ఉన్న మొబీన్తాజ్ షేక్ ఓటు తప్పుడు ఇంటి సంఖ్యతో ముద్రితమైంది. వరుస సంఖ్య 376లో ఎన్టీజీ-147607 ఐడీతో ఉన్న శ్రీనివాసులు, 233వ పోలింగ్ కేంద్రంలోని వరుస సంఖ్య 378లో ఎన్టీజీ-1116723 ఐడీతో నమోదైన వై.రాణి ఓట్లు తప్పుడు ఇంటి సంఖ్యలతో నమోదయ్యాయి.
పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలోని పోలింగ్ కేంద్రం 222లో ఓటర్ల పేర్ల చిరునామాల వద్ద తప్పులు కనిపిస్తున్నా అధికారులు జాబితా విడుదల చేయడంతో ఓట్లు పరిశీలించుకుంటున్న ఓటర్లు విస్తుపోతున్నారు. వరుస సంఖ్య 1లో సుకనయ యం, వరుస సంఖ్యలో 2లో అక్బర్ ఎస్, వరుస సంఖ్యలో 4లో మస్తాన్ షేక్, వరుస సంఖ్య 5లో బేదాశావల్లి ఇంటి సంఖ్యల వద్ద సున్నాగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?