అడ్డుకున్నా ఆపలేదు!
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు.
వైకాపా నేతల కబ్జాలో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం
గతంలో ఆక్రమణలు తొలగించినా తిరిగి నిర్మాణాలు
- న్యూస్టుడే, పీలేరు
2021, ఆగస్టులో తొలగిస్తున్న అక్రమ కట్టడాలు
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు విఫలమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఓ కీలక నేత అండదండలతో రూ.కోటి విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. పీలేరు పంచాయతీ పరిధిలో తిరుపతి మార్గంలో సర్వే సంఖ్య 901లో ఎకరన్నర రహదారులు, భవనాలశాఖకు చెందిన స్థలం ఉంది. ఇందులో కొందరు అధికార వైకాపా నాయకులు నిర్మాణాలు చేస్తుండగా, 2021, ఆగస్టులో అధికారులు అడ్డుకున్నారు. మదనపల్లె ఆర్డీవో జాహ్నవి ఆధ్వర్యంలో పీలేరు తహసీల్దారు పుల్లా రెడ్డి, ఆర్అండ్బీ ఇంజినీర్లు, సిబ్బంది పోలీసుల సహకారంతో యంత్రాలతో అక్రమ కట్టడాలు తొలగించారు. తాజాగా అక్రమార్కులు తిరిగి ఆక్రమిత స్థలంలో నిర్మాణాలు ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాల జోలికి పోవద్దని సదరు నేత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. తిరుపతి మార్గం పక్కన రూ.కోటి విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూడడం మినహా ఆపడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. ‘తిరుపతి మార్గంలో సర్వే నంబరు 901లో అక్రమ నిర్మాణాలను గతంలో తొలగించారు. ఇక్కడ నిర్మాణాలు చేయరాదని అప్పటి ఆర్అండ్బీ అధికారులు హెచ్చరించారు. తిరిగి నిర్మాణాలు చేస్తుంటే మేమేం చేయలేక ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం’ అని పీలేరు ఆర్అండ్బీ డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ‘గతంలో ఒకసారి అక్రమ నిర్మాణాలు తొలగించారు. అప్పట్లోనే ఆర్అండ్బీ అధికారులు వారి స్థలానికి ప్రహరీ నిర్మించుకుని ఉంటే ఆక్రమణలు పునరావృతమయ్యేవి కావు’ అని పీలేరు తహసీల్దారు మహబూబ్బాషా పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట