విజయవాడలో వృద్ధురాలి హత్య
విజయవాడ నగరంలో గవర్నర్పేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో లెనిన్ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలు హత్యకు గురైంది.
నిందితుడు కడప వాసి
విజయవాడ (గవర్నర్పేట), న్యూస్టుడే: విజయవాడ నగరంలో గవర్నర్పేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో లెనిన్ కూడలి పార్కులో బుధవారం తెల్లవారుజామున ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. చిట్టినగర్కు చెందిన ఓ వృద్ధురాలు (74) గత 20 సంవత్సరాలుగా గవర్నర్పేటలోనే ఉంటోంది. ఆమెకు ఒక కూతురు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నా పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ రాత్రి వేళ లెనిన్కూడలిలోని పార్కులో నిద్రపోతూ ఉంటుంది. కడపకు చెందిన ఆర్ల విజయశంకర్ (35) తన భార్య, పిల్లలను వదిలేసి కొద్ది సంవత్సరాలుగా విజయవాడలోనే ఉంటూ అదే పార్కులో పడుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే వృద్ధురాలు మంగళవారం రాత్రి వాకింగ్ ట్రాక్పై నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత విజయశంకర్ వచ్చి తాను పడుకునే స్థలంలో నువ్వు పడుకున్నావేంటి? అని ఆమెతో గొడవపడ్డాడు. ఆ గొడవ కాస్త... పెద్దదిగా మారి, వృద్ధురాలి గుండెలపై గట్టిగా గుద్దాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమెపై గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసి హత్య చేశారంటూ ఆరోపణలొచ్చాయి. దీనిపై పోలీసులు మాట్లాడుతూ అదంతా అవాస్తమమని, పడుకునే స్థల విషయమై ఏర్పడిన వివాదమే హత్యకు దారి తీసిందని చెప్పారు. నిందితుడు విజయశంకర్ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి