logo

కడప తెదేపాలోకి కీలక నేతల చేరిక

కడపకు చెందిన పలువురు కీలక నేతలు తెదేపాలో గురువారం చేరారు. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Published : 23 Feb 2024 02:43 IST

తెదేపాలో చేరిన నాయకులతో చంద్రబాబు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తదితరులు

ఈనాడు, కడప: కడపకు చెందిన పలువురు కీలక నేతలు తెదేపాలో గురువారం చేరారు. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైకాపా కీలక నేత చెన్నంశెట్టి మురళి, కత్తి రవితో పాటు మాజీ కార్పొరేటర్‌ రాజగోపాల్‌రెడ్డి, మైనార్టీ నేతలు మహమ్మద్‌ నవీద్‌ సోదరుడు మహమ్మద్‌ ఫిరోజ్‌, లయన్‌ మాన్సూర్‌ ఖాన్‌, జావేద్‌, జమాల్‌, షఫీ, షబీర్‌, తౌసిఫ్‌, తాహిర్‌, అప్సర్‌ఖాన్‌ చేరారు. మైనార్టీ వర్గానికి చెందిన కీలక నేతలు వైకాపా నుంచి తెదేపాలో చేరడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని