తెదేపాకు ఏజెంట్లు లేకుండా వైకాపా కుట్ర
రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా చేసేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
బీటెక్ రవి సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
వేంపల్లె, పులివెందుల, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున ఏజెంట్లు లేకుండా చేసేందుకు వైకాపా కుట్ర పన్నుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. వేంపల్లెలోని పుల్లయ్యతోటలో గురువారం పార్టీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు మరకా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాబుస్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి తెదేపా కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక దళితవాడలో తమ పార్టీకి చెందిన శేషగిరి తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే వైకాపా నేతలు దౌర్జన్యానికి దిగడం దారుణమని మండిపడ్డారు. పోలీసులు విచారించకుండానే తెదేపా నాయకులనే పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారని ఆరోపించారు. మరోవైపు తమ అనుచరుల ఇళ్లపై దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిజాయతీగా వ్యవహరించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ‘వైనాట్ పులివెందుల’ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. వైకాపాకు చెందిన ఎద్దుల సురేష్, వెంకటేష్, హుసేన్ పీరా, ప్రసాద్లతో పాటు మరో 15 కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో నాయకులు రామమునిరెడ్డి, రమేష్బాబు, షబ్బీర్, దర్బార్, వెంకటస్వామి, రమణ, ఎద్దుల శేషారెడ్డి, డీవీ సుబ్బారెడ్డి, జయచంద్రారెడ్డి, మహమ్మద్, రామగంగిరెడ్డి, పామలూరు చంటి, ఈశ్వరయ్య, నాగసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పులివెందులలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల నుంచి ఒక్క బీసీ లబ్ధి దారుడికీ రూ.లక్ష రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా అధికారంలోకొస్తే కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని, వడ్డెరులు, ఇతర కులవృత్తులదారులు ప్రమాదవశాత్తు మృతి చెందితే నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట