నాలుగేళ్ల తర్వాతా అదే పరిస్థితి!
పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సముదాయానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
అధికార పార్టీ నాయకుల సిండికేట్
వేలంపాట తాత్కాలికంగా వాయిదా
పీలేరు గ్రామీణ, న్యూస్టుడే: పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సముదాయానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పట్టణంలోని తిరుపతి మార్గంలో ఉండడంతో వ్యాపారానికి అనువుగా ఉంది. రోడ్డు పక్కనే 18 గదులతో ఉన్న వ్యాపార సముదాయాన్ని అద్ద్దెకిస్తున్నారు. వీటి ద్వారా నెలకు రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తోంది. గత నాలుగేళ్ల అనంతరం బహిరంగ వేలం పాటకు శ్రీకారం చుట్టారు. దీంతో పోటీ పెరిగి మార్కెట్కు అదాయం మరింతగా సమకూరే అవకాశం ఉంది. పాలకవర్గం ఆపని చేయకుండా గతంలో ఉన్న వ్యాపారులకే మరోసారి ఇస్తూ నవీకరణ పేరిట కొనసాగించింది. చిత్తూరు, మదనపల్లె మార్గంలో రైల్వే పైవంతెనల నిర్మాణాల కారణంగా మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలకు గిరాకీ పెరిగింది. గదులను దక్కించుకోవడానికి ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార వైకాపా నాయకులే ఈ తతంగంలో చక్రం తిప్పేందుకు రంగంలోకి దిగారు. ఎలాగైనా ఇక్కడ గదులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం జరగాల్సిన వేలం పాటను తాత్కాలికంగా వాయిదా వేశారు. వేలం పాట సమయాన్ని ఖరారు చేస్తూ ప్రకటన సైతం జారీ చేయగా, చివర్లో వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు డీడీలు కూడా చెల్లించారు. అధికార పార్టీ నాయకులు తమకే గదులు దక్కాలని ఒత్తిళ్లు తేవడంతో వేలం పాటలను వాయిదా వేసినట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాలతో వేలంపాటను వాయిదా వేశామని, త్వరలో తేదీని ప్రకటిస్తామని ఛైర్మన్ యల్లయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం