సమన్వయ లోపం.. ప్రజలకు ప్రాణ సంకటం
శాఖల మధ్య సమన్వయ లోపం... ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కడప నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
నేలకొరిగిన విద్యుత్తు స్తంభాలు
తప్పిన పెను ప్రమాదం
నివాసాలపై వాలిన విద్యుత్తు స్తంభాలు
న్యూస్టుడే, కడప గ్రామీణ: శాఖల మధ్య సమన్వయ లోపం... ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కడప నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు అడ్డుగా ఉన్నాయి. అలాంటి చోట ప్రణాళికతో పనులు చేయాల్సి ఉండగా, అధికారులు ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముత్రాసుపల్లెలో గురువారం రాత్రి జరిగిన సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. పెనుప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని గురుకుల్ విద్యాపీఠ్ ఎదురుగా ఉన్న రహదారి... మద్రాసు రోడ్డులో చిన్నచౌక్ పోలీసుస్టేషన్ మీదుగా ప్రధాన మార్గానికి చేరుకుంటుంది. ఈ మధ్యలో మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ జేసీబీతో భారీ గుంతలు తీస్తున్నారు. విద్యుత్తు స్తంభానికి అతి సమీపంలో మట్టి తీయడంతో ఒక్కసారిగా అది నేలకూలింది. తీగలపై ఒత్తిడితో అదే వరుసలో మరో రెండు స్తంభాలు కూడా నివాస భవనాలపై వాలాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలువలో పడిపోయింది. రాత్రి కావడంతో అక్కడ జనాలు లేరు. అదే పగలైతే పెను ప్రమాదం వాటిల్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువలో పడిన విద్యుత్తు నియంత్రిక
అవగాహన లోపం...
మురుగు కాలువ పనులు కావడంతో చుట్టుపక్కల మట్టి నీటి చెమ్మతో నాని మెత్తగా మారుతుంది. అలాంటి చోట ఆరిన తర్వాత మట్టి తీయాలి. స్తంభాలకు అతి సమీపంలో తవ్వకూడదు. తప్పదనుకుంటే విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించి, వారి ఆధ్వర్యంలో చేయాలి. గురువారం రాత్రి స్తంభాలు కిందకు వాలగానే ట్రిప్ అయి విద్యుత్తు సరఫరా ఆగిపోయిందని లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీరంగా కూడలి నుంచి బుగ్గవంక వరకు కూడా కాలువల పనులు జరుగుతున్నాయి. ఇక్కడా లోతుగా స్తంభాల అంచున తవ్వడంతో కొద్దిపాటి గాలి వీచినా అవి నేలకొరిగేలా ఉన్నాయి. గతంలో కలెక్టర్ బంగ్లా కూడలి నుంచి రిమ్స్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా పనులు చేసే సమయంలో వరుసగా పదుల సంఖ్యలో స్తంభాలు పడిపోయి, అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి, ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
లక్ష్మీరంగా కూడలిలో స్తంభాలకు దగ్గరగా తవ్విన కాలువ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత... కుటుంబ స‘మేత’!
[ 26-07-2024]
సారూ... వారు నేతలు కాదు మేతలు... సకుటుంబ సపరివార సమేతంగా, నాయకులు, కార్యకర్తలు అధికారమే అండగా తమ భూములను కబ్జా చేశారని, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు ఇలా ఒకటేమిటి దండోపాయాలెన్నో తమపై ప్రయోగించారని బాధితులు గగ్గోలు పెట్టారు. -
రెవెన్యూ చట్టాలు తెలుసా?
[ 26-07-2024]
ఇనాం భూములే కాదు.. సర్వీసు ఇనాం భూములంటాయని తెలియదా? ఇష్టారాజ్యంగా 22(ఏ)లను తొలగించేస్తారా? వీటికి నిబంధనలున్నాయనని తెలియదా? -
జగన్ ‘పైసా’చికం... ప్రాజెక్టులకు శాపం
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వం అసమర్థత వల్ల ఉమ్మడి కడప జిల్లాలోని ఏ ప్రాజెక్టుకూ నిధులివ్వకపోవడంతో సాగునీటి పనులు ఎక్కడికక్కడే అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. -
అనలైజర్ మూలకు... రోగులు ప్రైవేటుకు
[ 26-07-2024]
సర్వజన ఆసుపత్రిలోని బయోకెమిస్ట్రీ విభాగంలో ఏడాది కాలంగా అనలైజర్ యంత్రం పని చేయకపోవడంతో మధుమేహ పరీక్షలు నిర్వహించడం లేదు. -
సీట్లు 35... ప్రయాణికులు 120
[ 26-07-2024]
కళాశాల, పాఠశాలల విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బడి బస్సు నడపాలని విద్యార్థులు రామన్నూతలపల్లె వద్ద ఆర్టీసీ బస్సును ఆపి గురువారం ఆందోళన చేపట్టారు. -
యువత నిర్వీర్యం... జగన్దే ఆ పాపం
[ 26-07-2024]
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైంది. అద్దె గదులు, సిబ్బంది కొరత కారణంగా విజ్ఞాన భాండాగారాల నిర్వహణ కష్టమౌతోంది. -
వివస్త్రను చేసి... చెట్టుకు కట్టేసి
[ 26-07-2024]
మానవత్వం మంటగలిసేలా ఓ మహిళను నడి ఊరిలో చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. -
జలాశయం గేటు... వరదొస్తే చేటు
[ 26-07-2024]
బాహుదా జలాశయం కుడికాలువ తూము గేటు మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులతో అధికారులు మమ అనిపిస్తున్నారు. -
ఈసారి కచ్చితంగా కనిపెట్టాలని!
[ 26-07-2024]
ప్రపంచంలో అరుదైన పక్షిగా గుర్తింపు పొందిన కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రారంభమైంది. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించండి: ఎస్పీ
[ 26-07-2024]
జిల్లా పోలీసు అధికారి హర్షవర్ధన్రాజు గురువారం నగరంలోని రిమ్స్, చిన్నచౌకు ఠాణాలతో పాటు చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట స్టేషన్లను తనిఖీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!