ఖర్చు రూ.కోట్లు... నాణ్యతకు తూట్లు
జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని కాలిబాటల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
మాసాపేటలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కూలిపోయిన కాలిబాట
జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని కాలిబాటల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రూ.150 కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో నిర్మించిన కొంత కాలానికే కూలిపోతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని కారణంగా చూపి గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. మదనపల్లె రోడ్డు, చిత్తూరు రింగ్రోడ్డు, మాసా పేట తదితర ప్రాంతాల్లోని కాలిబాటలు కూలిపోవడంతో పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యన ఎన్హెచఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులకు నోచుకోవడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలిబాటల మరమ్మతుల బాధ్యత గుత్తేదారులపై ఉన్నా వారికి రావాల్సిన బిల్లులు అందకపోవడంతో పనులు చేసే పరిస్థితి లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్హెచ్ఏఐ ఏఈ రఘునాథబాబు మాట్లాడుతూ కూలిపోయిన కాలిబాటలకు మరమ్మతులు చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించామని, త్వరలోనే పనులు చేపడతామన్నారు.
న్యూస్టుడే, రాయచోటి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే