logo

యువకుడిపై దాడి... దుకాణం ధ్వంసం

ఓ యువకుడిపై కొంతమంది దాడి చేసి అతను పనిచేస్తున్న దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది.

Published : 02 Mar 2024 04:11 IST

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : ఓ యువకుడిపై కొంతమంది దాడి చేసి అతను పనిచేస్తున్న దుకాణాన్ని ధ్వంసం చేసిన ఘటన పట్టణంలో శుక్రవారం జరిగింది. పట్టణంలోని అప్పారావుతోటకు చెందిన ఇక్‌లాక్‌ (21) డిగ్రీ చదువుతూ పట్టణంలోని పీరు సిగ్నేచర్స్‌ డిజిటల్‌ బ్యానర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఉదయం తన స్నేహితుడు వసీమ్‌ను అదే ప్రాంతానికి చెందిన ఫరీద్‌ కొడుతుండగా ఇక్‌లాక్‌ అడ్డుకునికొట్టాడు. దీంతో ఆగ్రహించిన ఫరీద్‌ తన అనుచరులతో వచ్చి ఫ్యారానగర్‌లోని డిజిటల్‌ బ్యానర్స్‌ తయారీ దుకాణంలో పనిచేస్తున్న ఇక్‌లాక్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా షాపులోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇక్‌లాక్‌ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని