logo

‘నకిలీ మద్యం బ్రాండ్ల సృష్టికర్త జగన్‌’

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహనన్‌రెడ్డి నకిలీ మద్యం బ్రాండ్ల ప్రదాత అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అబ్బురి చంద్రబాబు నాయుడు అన్నారు.

Published : 02 Mar 2024 04:12 IST

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహనన్‌రెడ్డి నకిలీ మద్యం బ్రాండ్ల ప్రదాత అని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అబ్బురి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం పీలేరు తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవగాహన కల్పించాల్సిన ముఖ్యమంత్రి 22 నకిలీ మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి తాగిస్తూ వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా ఏపీలో సరైన మౌలిక వసతులు లేక పరిశ్రమలు తిరుగుముఖం పట్టాయని ఆయన ఆరోపించారు. పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవడంతోనే నేడు నిరుద్యోగం పెరిగిపోతోందని ఆయన చెప్పారు. అధికారంలోకి రాగానే 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌ మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. సంపద సృష్టి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం సీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ‘మొదటి ఓటు చంద్రబాబు నాయుడుకే’ కార్యక్రమం నిర్వహించారు. ముభాకర్‌, నఫీస్‌, అబ్దుల్లా, భాను, సందీప్‌, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని