శిక్షణ పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపీ
వ్యాపారంలో మెలకువలు నేర్పుతామని ఓ సంస్థ వందలాది నిరుద్యోగులను చేర్చుకుని వారికి శిక్షణనిచ్చి రూ.వేలకు వేలు కట్టించుకోవడంతోపాటు గొలుసు కట్టు విధానంలో మరికొందరిని చేర్పించాలని ఒత్తిడి తెచ్చింది.
డబ్బులు కట్టించుకుని నాసిరకం దుస్తుల సరఫరా
పోలీసులకు బాధితుల ఫిర్యాదు... చీటింగ్ కేసు నమోదు
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే : వ్యాపారంలో మెలకువలు నేర్పుతామని ఓ సంస్థ వందలాది నిరుద్యోగులను చేర్చుకుని వారికి శిక్షణనిచ్చి రూ.వేలకు వేలు కట్టించుకోవడంతోపాటు గొలుసు కట్టు విధానంలో మరికొందరిని చేర్పించాలని ఒత్తిడి తెచ్చింది. చివరకు నాసిరకం దుస్తులు అంటగట్టింది. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు శుక్రవారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీఐ యువరాజ్ తెలిపిన వివరాల ప్రకారం... సీటీఎం రోడ్డులోని గ్యాబ్రిజ్ ఫ్యాషన్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో మదనపల్లె చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు. వారు వ్యాపారం చేసుకునేవిధంగా వస్త్రాలిస్తామని నమ్మబలికారు. దీన్ని నమ్మి వందలాది మంది నిరుద్యోగులు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయిన అనంతరం రూ.45 వేలు కట్టించుకుని నాసిరకం దుస్తులు అంటగట్టారు.
జత దుస్తుల ధర రూ.8 వేలు నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. అవి బహిరంగ విపణిలో రూ.1,000 కూడా చేయవని గుర్తించిన కొందరు యువకులు ఇదేమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కుంచేవారిపల్లెకు చెందిన రాజశేఖర్, అతని స్నేహితుడు జగదీష్ శిక్షణకు వచ్చారు. వారికి గ్యాబ్రిక్ ఫ్యాషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారు. రూ.45 వేలు కట్టాల్సి ఉంటుందని చెప్పడంతో రాజశేఖర్ డబ్బు కట్టారు. శిక్షణ ఇచ్చిన సంస్థ తెల్లషర్టు, నల్లప్యాంటు ఇచ్చి మరో అయిదుగురిని సంస్థలో చేర్చాలని షరతు పెట్టి ఒత్తిడి తెచ్చారు. కొన్ని నాసిరకం దుస్తులిచ్చి వాటిని విక్రయించుకుని ఆదాయం పొందాలని సూచించారు. నాసిరకం దుస్తులివ్వడం, చైను లింకు పద్ధతిలో కొందరిని చేర్చమనడంపై సంస్థ ప్రతినిధులను రాజశేఖర్ నిలదీయడంతో ఆయన బయటకు పంపేశారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంస్థ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సంస్థ రికార్డులు పరిశీలించి అనుమతి ఉందా లేదా విచారిస్తామన్నారు. బాధితులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతలే భూబకాసురులు
[ 27-07-2024]
‘వైకాపా పాలనలో భూబకాసురుల పాలైన స్థలాలు, పొలాలు బాధితులకు దక్కేలా చూడాలి.. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.. -
టమాట వింటోంది
[ 27-07-2024]
టమాట దిగుబడులు పెరగడంతో ధరలు తగ్గుముఖంపట్టాయి. మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో వారం రోజుల కిందట కిలో టమాట రూ.70 నుంచి 80 వరకు పలికింది. -
కృష్ణవేణీ... కదలిరావే అలివేణీ
[ 27-07-2024]
గతేడాది వర్షాభావంతో కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నోచుకోలేదు. ఆరుతడి పంటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
చొరబడి నిర్మాణం.. తడబడిన వ్యవహారం
[ 27-07-2024]
రాష్ట్రంలోని పాత 13 జిల్లాల పరిధిలో జగన్ ప్రభుత్వం విచక్షణారహితంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో చేపట్టిన గ్రామ సచివాలయ భవనం -
జిల్లాలో బీటెక్ రవిపైనే అత్యధిక కేసులు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి పాలకుడి ధోరణిని జనం గమనిస్తూనే ఉన్నారు. -
బినామీల గుండెల్లో సునామీ!
[ 27-07-2024]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. -
జగన్ కేసులు పెట్టారు... జనం గద్దె దింపారు
[ 27-07-2024]
వైకాపా పాలనలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై నిర్బంధం కొనసాగింది. ప్రశ్నించిన వారందరిపైనా కేసులు నమోదు చేశారు. వందల్లో కేసులు నమోదయ్యాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!