logo

Sharmila: పోలవరంపై రీసర్వే నిర్వహించాలి: షర్మిల

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 26 Apr 2025 18:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: జగన్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదని, రీసర్వే నిర్వహించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పోలవరం నిర్వాసితులు శనివారం ఆమెను కలిశారు. తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘జగన్‌ హయాంలో ప్రాజెక్టు సర్వే సరిగా జరగలేదు. రీసర్వే నిర్వహించాలి. గతంలో ఆమోదయోగ్యం కాని.. ముంపు భూములిచ్చారు. కొత్తగా తరలించిన ప్రాంతాల్లో సరైన వసతులు లేవు. ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీలో ఇతరుల పేర్లు ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారు’’ అని అన్నారు.

Tags :
Published : 26 Apr 2025 17:51 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని