logo

Crime News: సైబరాబాద్‌లో రుణం ఇప్పించాడు.. తెలియకుండా మోసగించాడు

Eenadu icon
By Telangana Dist. Desk Published : 27 Jan 2025 05:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూలో ఆరుగురిపై కేసు 

ఈనాడు- హైదరాబాద్‌: బ్యాంకులో విద్యారుణం ఇప్పిస్తామంటూ ఓ వృద్ధుడిని మోసగించిన వ్యవహారంలో సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదుచేశారు. నగరంలోని అత్తాపూర్‌కు చెందిన వ్యక్తి(59) గతంలో దుబాయ్‌లో పనిచేసి తిరిగొచ్చాడు. 2016లో మొయినాబాద్‌ మండలం యంకపల్లిలో 1068 చదరపుగజాల స్థలం కొని ఇళ్లు నిర్మించి నివాసముంటున్నాడు. బ్రిటన్‌ చదువుతున్న పిల్లల విద్యారుణం కోసం 2021లో రాజేంద్రనగర్, మాదాపూర్‌లోని బ్యాంకుల్ని సంప్రదించాడు. ఇల్లు పూచీకత్తు కింద పెడతామని చెప్పినా 111జీవో పరిధిలో ఉందంటూ తిరస్కరించారు. 2022లో బ్యాంకుఏజెంటుగా పనిచేసే వర్మ, ఓ బ్యాంకు ఉద్యోగి రవి.. బాధితుడిని సంప్రదించి.. ప్రవాస భారతీయుడు మణికొండ కిశోర్‌కుమార్‌ను పరిచయం చేశారు. అతడు విజయవాడ గవర్నరుపేట ఇండియన్‌ఓవర్సీస్‌ బ్యాంకునుంచి రుణం ఇప్పిస్తానన్నాడు. దరఖాస్తు చేసినా తిరస్కరణకు గురైంది. తర్వాత కిశోర్‌ మరో పథకం తెరపైకి తెచ్చాడు. యంకపల్లిలోని ఇంటి యాజమాన్య హక్కుల్ని తనకు బదిలీచేస్తే.. ఎన్‌ఆర్‌ఐ కోటాలో రుణం వస్తుందన్నాడు. రుణం తిరిగి చెల్లించాక ఆ ఆస్తిని బాధితుడి పేరుమీదకు బదిలీ చేస్తానని చెప్పాడు. అంగీకరించిన బాధితుడు ఒప్పందం మేరకు.. 2022 జులైలో తన ఆస్తిని కిశోర్‌ పేరిట బదిలీ చేశాడు. ఆ ఒప్పందంలో కిశోర్‌ రూ.1.76 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి బాధితుడికి ఇచ్చింది రూ.40లక్షలే. విజయవాడ బ్యాంకులో రూ.3.75 కోట్ల రుణం మంజూరైంది. రెండు డీడీలు బాధితుడు, అతడి భార్య పేరుతో వచ్చాయి. వెంటనే కిశోర్‌ జోక్యం చేసుకుని రూ.1.62 కోట్లు ఎ.మోహన్‌రావు పేరిట ఉన్న ఖాతాలకు బదిలీ చేయించాడు. దీనికి మూడు నెలల వాయిదాలు చెల్లించి ఆపేశాడు. బాధితుడు ఫోన్‌చేయగా.. తిట్టి స్పందించడం మానేశాడు. రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు బాధితుడి ఇంటిని స్వాధీనంచేసుకుంది. ఈ వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదుచేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు