logo

Kavitha: గ్రామ పంచాయతీల వారీగా కులగణన సర్వే వివరాలు వెల్లడించాలి: కవిత

Eenadu icon
By Telangana Dist. Team Updated : 23 Sep 2025 10:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. హడావుడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లేనన్నారు. గ్రామ పంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని కవిత తెలిపారు.

Tags :
Published : 23 Sep 2025 10:00 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు