logo

Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లు.. నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ

Eenadu icon
By Telangana Dist. Team Updated : 10 Dec 2024 07:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్‌

పాదచారుల కోసం సమస్యాత్మక కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. హెచ్‌-సిటిలో భాగంగా..హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.25కోట్లతో ఉప్పల్‌ కూడలిపై స్కై వాక్‌ నిర్మాణమైంది. వరంగల్‌ రోడ్డు, రామంతాపూర్‌ రోడ్డు, నాగోల్, మెట్టుగూడ మార్గాలతోపాటు ఉప్పల్‌ మెట్రోరైలు స్టేషన్‌ను కలుపుతూ నిర్మాణమైన నడకమార్గానికి.. అన్ని వైపులా మెట్లు, లిఫ్టులు ఉన్నాయి. రహేజా మైండ్‌స్పేస్‌ ప్రాంగణంలోనూ ఇలాంటి నిర్మాణం పాదచారుల ఆదరణ పొందింది. ఇలాంటి స్కై వాక్‌లు మరిన్ని కూడళ్లలో అవసరమని జీహెచ్‌ఎంసీ ఇటీవల ప్రభుత్వానికి విన్నవించింది. హెచ్‌-సిటి ప్రాజెక్టు కింద తాజాగా పురపాలకశాఖ రూ.5,942 కోట్ల అంచనా వ్యయంతో 23 పనులు చేపట్టాలని బల్దియాకు పరిపాలన అనుమతి ఇచ్చింది. మొదట 2 కూడళ్లపై..గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ కూడలిలో రూ.459 కోట్లతో 2పైవంతెనలు, 2అండర్‌పాస్‌లు, రూ.158 కోట్లతో విప్రో చౌరస్తాలో ఓ పైవంతెన, ఐసీఐసీఐ చౌరస్తాలో అండర్‌పాస్‌ నిర్మాణానికి సర్కారు పరిపాలన అనుమతి ఇచ్చింది.  మియాపూర్, అల్విన్‌కాలనీ చౌరస్తా, ఆరాంఘర్‌ కూడళ్లలోనూ.. స్కై వాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు ఉన్నాయంటున్నారు. 

Tags :
Published : 10 Dec 2024 07:32 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు