Hyderabad: కి.మీ.రోడ్డుకు.. రూ.3.35 కోట్లు
బాగున్న రోడ్లనే బాగు చేస్తామంటూ ప్రతిపాదనలు
రూ.3,825 కోట్లతో సీఆర్ఎంపీ-2
ఈనాడు, హైదరాబాద్

సీఆర్ఎంపీ-2 (రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం) పేరుతో జీహెచ్ఎంసీ రాబోయే ఐదేళ్లకు 1,142.54 కి.మీ రోడ్లకు రూ.3,825 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. అంటే.. సగటున కిలోమీటరు రోడ్డు నిర్వహణకు రూ.3.35కోట్లు వెచ్చించబోతోంది. ఐదేళ్ల కిందట సీఆర్ఎంపీ-1 ప్రాజెక్టు మొదలైనప్పుడు ఈసగటు వ్యయం రూ.2.59 కోట్లు ఉండగా.. తాజా గా రూ.3.35 కోట్ల కు చేరుకుంది. రాబోయే ఐదేళ్లు పూర్తయ్యే నాటికి ఆ సగటు వ్యయం రూ.4.5కోట్లకు చేరొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. మొదటి దశలో పునర్ నిర్మించిన వందలాది కిలోమీటర్ల రోడ్లనే.. రెండో దశలోనూ కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా నిర్మాణానికి నోచుకోకుండా.. గుంతలతో ప్రజలను ఇబ్బందిపెట్టే అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాగున్న రోడ్లపైనే వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తామంటూ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఆమోదించాలంటూ స్థాయీ సంఘానికి తీర్మానం పంపడంపై ఆరోపణలొస్తున్నాయి.
సీఆర్ఎంపీ-1లో..
2020లో సీఆర్ఎంపీ-1 మొదలైంది. ఏడు ప్యాకేజీలుగా 709కి.మీ రోడ్లను రూ.1,839కోట్లతో ఐదేళ్లపాటు నిర్వహించాలని జీహెచ్ఎంసీ పనులు అప్పగించింది. ఈ క్రమంలో మరికొన్ని రోడ్లను చేర్చడంతో జీహెచ్ఎంసీ రూ.2,491కోట్లు వెచ్చించింది. మొదటి దశ పూర్తవడంతో.. 2025-2030 కాలానికి రెండో దశకు ఇంజినీర్లు ప్రతిపాదనలు రూపొందించారు.
పాత రోడ్లనే..
సీఆర్ఎంపీ-1లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. ఆయా రోడ్లకు, మరో 398.32కి.మీ రోడ్లను కలిపి మొత్తం 1,142.54 కి.మీ రోడ్లకు సీఆర్ఎంపీ-2 ప్రతిపాదించారు. అవసరమైనచోట వరదనీటి కాలువలను నిర్మించి, నిర్వహించడం, ప్రధాన దారుల్లోని వరదనీటి కాలువలు, మ్యాన్హోళ్ల నిర్వహణ రెండోదశలో భాగమని ఇంజినీర్లు చెబుతున్నారు.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


