యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పిస్తానంటూ రూ.కోటి స్వాహా!

ఈనాడు, హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా ఇప్పిస్తానంటూ ఒక కంపెనీ డైరెక్టర్ మోసగించాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నగర సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలకు వివిధ రకాల సేవలు అందిస్తుంది. ఆ సంస్థ డైరెక్టర్ను గతేడాది రాకేశ్కుమార్ శర్మ అనే వ్యక్తి కలిసి వరల్డ్ వైడ్ జూ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్గా పరిచయం చేసుకున్నాడు. యూఏఈ బేస్డ్ గ్రూప్లతో తాము జంతుప్రదర్శన, పర్యాటక రంగాల్లో ప్రాజెక్ట్ల్లో భాగస్వామ్యం ఉన్నట్టు నమ్మించాడు. తన పరిచయాలతో యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పిస్తానంటూ భరోసానిచ్చాడు. విదేశాల్లో వ్యాపార భాగస్వామ్యం కొనసాగించవచ్చని చెప్పటంతో బాధితుడు నిజమని నమ్మాడు. గతేడాది రెండు దఫాలుగా మొత్తం రూ.1,52,38,346 అతడి ఖాతాల్లో జమచేశాడు. ఎంతకీ గోల్డెన్వీసా రాకపోవటంతో బాధితుడు నిలదీయటంతో రూ.50లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.1,02,38,346 ఇవ్వకపోవడంతో నగర సీసీఎస్లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుండెపోటుతో వార్డు సభ్యురాలి మృతి
[ 08-12-2025]
పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న ఓ వార్డు సభ్యురాలు గుండెపోటుతో మృతి చెందారు. -
టిప్పర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం
[ 08-12-2025]
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొట్టడంతో ఓ మహిళతో పాటు రాపిడో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. -
చలిలో వేడిగా.. వ్యాధులకు దూరంగా
[ 08-12-2025]
రోజురోజుకు నగరంలో చలి తీవ్రత పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వైరల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. -
పాకిస్థాన్లోనూ చార్మినార్!
[ 08-12-2025]
చారిత్రక చార్మినార్ కట్టడాన్ని మహమ్మద్ కులీ కుతుబ్షా 1591లో నిర్మించారు. ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కట్టడంలో పర్షియన్ శైలి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. -
మాస్టర్ప్లాన్నూ మాయ చేశారు.. కోకాపేట ట్రంపెట్ నిర్మాణంలో అధికారుల కుమ్మక్కు
[ 08-12-2025]
హెచ్ఎండీఏ అధికారులు మాస్టర్ప్లాన్లోనూ మాయ చేశారు. పాత బృహత్తర ప్రణాళికను అడ్డుపెట్టుకుని.. ప్రైవేటు వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చారు. -
క్యూర్కు మెట్రో దన్ను
[ 08-12-2025]
హైదరాబాద్ బృహత్ నగరంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇచ్చేలా తెలంగాణ రైజింగ్ 2047 నాటికి మెట్రోరైలు/లైట్ రైల్ ట్రాన్సిట్/బీఆర్టీఎస్ను 623 కి.మీ.పైగా విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. -
సగర్వంగా.. సర్వాంగ సుందరంగా
[ 08-12-2025]
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కి తగ్గట్లుగానే భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. -
కారులో హీటరా.. తస్మాత్ జాగ్రత్త
[ 08-12-2025]
నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
రూ.కోట్లు కుమ్మరింత.. కంపుతో కలవరింత
[ 08-12-2025]
తొలుత కూకట్పల్లి నాలా వద్ద రసాయన వ్యర్థాలు తొలగించేందుకు సిద్ధమైనా తర్వాత విరమించుకున్నారు. కూకట్పల్లి నుంచి అధికస్థాయి పారిశ్రామిక వ్యర్థాలు హుస్సేన్సాగర్లో చేరుతున్నాయి. -
వస్తే వరుస.. ఆలస్యంతో రుసరుస
[ 08-12-2025]
‘వస్తే వరుస లేదంటే నల్లపూస’ అన్న చందంగా కొన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. -
రైతు, జవాన్.. దేశానికి వెన్నెముక
[ 08-12-2025]
రైతు లేకపోతే తినడానికి తిండి ఉండదని, జవాన్ లేకపోతే జీవితానికి రక్షణ ఉండదని.. వారు దేశానికి వెన్నెముకలాంటి వారని కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. -
జీవనశైలి మార్పుతోనే మధుమేహ సమస్య
[ 08-12-2025]
జీవనశైలిలో మార్పులు, జన్యుకారణాల వల్ల మధుమేహ సమస్య పెరుగుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. -
భూగర్భ తీగలు.. లేదంటే ఏబీ కేబుళ్లు
[ 08-12-2025]
నగరంలో భూగర్భ విద్యుత్తు తీగలు లేదా ఏబీ కేబుల్స్ వేయడానికి అవసరమైన నిధుల సమీకరణపై డిస్కం దృష్టి సారించింది. -
35 తులాల బంగారం, నగదు మాయం
[ 08-12-2025]
ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. షేక్పేట అల్-హమ్రాకాలనీలో ఉండే డా.కమ్రాన్ జహాన్ కుటుంబంతో కలిసి అస్సాంకు వెళ్లారు. -
అధునాతన వసతులు.. ఉత్తమ చదువులు
[ 08-12-2025]
విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. -
దూదిపూలు.. కష్టాలపాలు
[ 08-12-2025]
పత్తి రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సీసీఐ రోజుకో నిబంధన అమలు చేస్తుండడంతో గందరగోళం నెలకొంటోంది. -
పల్లె పోరులో పదనిసలు..
[ 08-12-2025]
పంచాయతీ ఎన్నికల్లో పలు విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే పేరుతో సర్పంచులుగా పోటీ చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. -
ఆహార శుద్ధి.. ఆర్థిక వృద్ధి
[ 08-12-2025]
మహిళా సంఘాల ఉన్నతికి కేంద్ర], రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. వడ్డీలేని రుణాలు అందిస్తూ కోటీశ్వరులను చేసే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. -
పక్కలో బల్లెం.. గెలుపుపై కలవరం
[ 08-12-2025]
స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పడం లేదు. ‘నేనూ అదే పార్టీ అభ్యర్థిని.. నాకు మద్దతు ఇవ్వండి’.. అంటూ ప్రచారం చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. -
ఉద్యోగులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 08-12-2025]
కొంతమంది ఉద్యోగులు ఏదో ఒక అభ్యర్థికి, రాజకీయ పార్టీకి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ.. సందర్భం వచ్చినప్పుడు తమ మనోభావాలను బహిర్గతం చేస్తుంటారు. -
మక్కలపైనే మక్కువ
[ 08-12-2025]
‘దోమకు చెందిన రైతు కిష్టప్ప ఖరీఫ్లో ఎకరం మొక్కజొన్న సాగుచేశాడు. 35క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. విక్రయించగా పెట్టుబడి పోను రూ.60వేల లాభం దక్కింది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


