logo

Ponguleti Srinivas Reddy: బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 10 Jul 2025 22:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్‌ ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యాబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

‘‘ఇవాళ్టితో కలిపి 19 క్యాబినెట్‌ భేటీలు నిర్వహించాం. ఇప్పటి వరకు జరిగిన భేటీల్లో 321 అంశాలను మంత్రివర్గం ఆమోదించింది. గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించాం. ప్రతిష్ఠాత్మక అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్‌ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు ఆమోదం తెలిపాం. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తిచేశాం’’ అని పొంగులేటి తెలిపారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ 17వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయించామని తెలిపారు.


Tags :
Published : 10 Jul 2025 21:20 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని