Ration cards: హైదరాబాద్లో రేషన్కార్డులు ఆలస్యం
కులగణన అర్జీల సర్వే పూర్తయినా ఆగని దరఖాస్తులు
అన్నింటి  లెక్క తేల్చాక వార్డు సభలు, కార్డుల జారీ
ఈనాడు, హైదరాబాద్

రాజధానిలో రేషన్కార్డుల మంజూరులో జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లాల్లో మాదిరే.. గణతంత్ర దినోత్సవం రోజున నగరంలో రేషన్కార్డులను జారీ చేయాలని మొదట సర్కారు భావించింది. అందులో భాగంగా ఇటీవల కులగణన సర్వేలో కార్డు కోసం అర్జీ పెట్టుకున్న 83వేల మంది అర్హతల పరిశీలనను మంగళవారంతో పూర్తి చేసింది. అయితే ఇటీవల ప్రజాభవన్కు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు సుమారు లక్షమంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించినట్లు జనవరి 26న రేషన్కార్డులను జారీ చేస్తే.. వారంతా అసంతృప్తికి గురవుతారని సర్కారు పునరాలోచనలో పడింది.
కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ.. అందరికీ న్యాయం చేయాలని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పష్టం చేశారు. ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులనూ పరిగణనలోకి తీసుకొని అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అర్హుల పరిశీలన మరో వారం కొనసాగుతుందని, ఫిబ్రవరి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు.
90శాతం అర్హులే..: ప్రభుత్వం ఇటీవల సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)ను పూర్తి చేసింది. అందులో భాగంగా 83వేల కుటుంబాలు అర్జీ పెట్టుకున్నాయి. వారి అర్హతలను పరిశీలించగా.. 90శాతం మంది అర్హులని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


