Telangana Cabinet: 201 కి.మీ మేర ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201కి.మీ మేర ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం సుదీర్ఘంగా భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మీడియాకు వెల్లడించారు. రేపటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుందని, 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. రైతుభరోసా కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రైతుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
‘‘వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ నీటి వాటాను ఏపీకి అప్పగిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. బనకచర్ల బంకను మా ప్రభుత్వానికి రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం. గోదావరి జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. గోదావరి జలాల విషయంలో జులై మొదటి వారంలో కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరంపై ఈనెల 30లోపు కమిషన్కు పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం. కాళేశ్వరానికి గత ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం ఉందా? లేదా? వివరాలు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని పొంగులేటి వివరించారు. నూతన క్రీడా పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడా కోటాలో రిజర్వేషన్లు పెంచాలని, క్రీడాకారులను ప్రోత్సహించేలా పారితోషికాలు ఇవ్వాలని నిర్ణయించింది.
కేబినెట్ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలు..
- రేపు సాయంత్రం 4 గంటలకు రైతునేస్తం కార్యక్రమం ఘనంగా నిర్వహిండం
 - అన్ని కలెక్టరేట్లలో డిసెంబరు 9 నాటికి తెలంగాణ విగ్రహాలు ఏర్పాటు చేయడం
 - బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టం, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం
 - విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల సమావేశం నిర్వహించాలని నిర్ణయం
 - కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఈనెల 30 లోగా కమిషన్కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం
 - తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం
 - తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు ఆమోదం
 - డిసెంబరు 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ ఆవిష్కరించాలని నిర్ణయం
 - సంగారెడ్డి జిల్లాలోని రెండు కొత్త మున్సిపాల్టీలు ఏర్పాటుకు ఆమోదం
 - ఇస్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడ్కు మంత్రివర్గం ఆమోదం
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
[ 03-11-2025]
పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. - 
                            
                                
                                ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. - 
                            
                                
                                బైక్ను ఢీకొన్న కారు.. ఒకరికి తీవ్ర గాయాలు
[ 03-11-2025]
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. - 
                            
                                
                                చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. - 
                            
                                
                                చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (chevella Road Accident) ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. - 
                            
                                
                                చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. - 
                            
                                
                                చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నం!
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన చోట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన ఎదురైంది. - 
                            
                                
                                వివాదంలో తలదూర్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు
[ 03-11-2025]
తమను జైలుపాలు చేసిన ఇద్దరిని హత్యచేసేందుకు ఓ గ్యాంగు సభ్యులు కత్తులు నూరుతుండగా.. అనవసరంగా మధ్యలో తలదూర్చిన కిళ్లీ కొట్టు యజమాని దారుణంగా హతమయ్యాడు. - 
                            
                                
                                అక్కడ గాలి ఎటుంది గురూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పందెంరాయుళ్ల ఆరా
[ 03-11-2025]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బెట్టింగ్రాయుళ్లు ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై పందేలు కాస్తున్నారు. - 
                            
                                
                                ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. 19 మంది దుర్మరణం!
[ 03-11-2025]
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. - 
                            
                                
                                కేసులు తేలట్లే.. దస్త్రాలు కనిపించట్లే!
[ 03-11-2025]
నగరంలో బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ నుంచి.. కేసు దర్యాప్తు పూర్తిచేయటం పోలీసులకు సవాల్గా మారింది. - 
                            
                                
                                రూ.25 లక్షల చికిత్స... నిమ్స్లో ఉచితం!
[ 03-11-2025]
ఆ యువకుడుకి పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలున్నాయి. వీటితో పాటు శరీరంలో అసాధారణ కదలికలు. - 
                            
                                
                                ఏ‘మండీ’.. పట్టించుకోరు!
[ 03-11-2025]
రెండు దశాబ్దాల తర్వాత జియాగూడ కబేళా ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. - 
                            
                                
                                వేషం బాగుంది.. వేడుక అదిరింది
[ 03-11-2025]
మాదాపూర్ హైటెక్స్లో మూడు రోజుల పాటు సందడిగా సాగిన కామిక్కాన్ వేడుకలు ఆదివారం రాత్రి ముగిశాయి. - 
                            
                                
                                కీసరగుట్ట ఆలయ అభివృద్ధి నిర్విఘ్నంగా జరగాలి
[ 03-11-2025]
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పంతో చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగి, భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూరాలని దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిదుశేఖర భారతి మహాస్వామి అన్నారు. - 
                            
                                
                                నకిలీ వెబ్సైట్లు.. వాట్సప్ డీపీలతో మాయలు
[ 03-11-2025]
కొద్ది పెట్టుబడితో భారీ రాబడి.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అవకాశం. - 
                            
                                
                                ప్రకృతి దగ్గరగా ఉంటే జబ్బులకు దూరం
[ 03-11-2025]
మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలని, ప్రకృతికి దగ్గరగా ఉంటే జబ్బులకు దూరంగా ఉండొచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్టర్ డా.సత్యలక్ష్మి పేర్కొన్నారు. - 
                            
                                
                                ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-11-2025]
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు భారాస, భాజపా ప్రకటించాయి. - 
                            
                                
                                భాజపా ముఖ్యనేతలకు జూబ్లీహిల్స్ఠ్ ప్రచార బాధ్యతలు
[ 03-11-2025]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఏపీ భాజపా అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక నేతలందరికీ డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. - 
                            
                                
                                ఉప ఎన్నికకు హస్తం పార్టీ సమన్వయ కమిటీ నియామకం
[ 03-11-2025]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదివారం సమన్వయ కమిటీని నియమించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. - 
                            
                                
                                నెక్లెస్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు
[ 03-11-2025]
పర్యాటకుల సౌకర్యార్థం నెక్లెస్ రోడ్డు మార్గంలో టీజీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                            
                                
                                రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 03-11-2025]
పటాన్చెరు పారిశ్రామికవాడలోని రూపఇండస్ట్రీస్ రసాయన పరిశ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. - 
                            
                                
                                ఆర్ఎంసీ యూనిట్లపై పీసీబీ కొరడా
[ 03-11-2025]
అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కొరడా ఝళిపించింది. - 
                            
                                
                                భారాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై కేసు
[ 03-11-2025]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారాస ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. - 
                            
                                
                                పెళ్లయిన నెలలోపే యువకుడి ఆత్మహత్య
[ 03-11-2025]
వారికి నెల కిందటే వివాహం జరిగింది. పెళ్లికి ముందు భార్య జరిపిన ప్రేమ వ్యవహారం తెలియడంతో మనస్తాపంతో భర్తఆత్మహత్యకు పాల్పడ్డాడు. - 
                            
                                
                                అందరూ దూరమై.. ఆవేదన చేరువై
[ 03-11-2025]
కుల్కచర్ల మండల కేంద్రంలో శనివారం జరిగిన హత్యాకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. - 
                            
                                
                                గీతాసారం.. కర్తవ్య సాధనం
[ 03-11-2025]
‘ఫలితాల గురించి చింతించకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టాలన్న’ భగవద్గీత బోధనలను ప్రచారం చేస్తూ నేర్పిస్తున్నారు వికారాబాద్ పట్టణానికి చెందిన గీతావాహిని సభ్యులు. - 
                            
                                
                                కేంద్రాలకు కొత్త రూపు
[ 03-11-2025]
ప్రత్యేక అవసరాల పిల్లలను చక్కగా తర్ఫీదునిచ్చి సాధారణంగా తీర్చిదిద్దడానికి భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన మంజుమ్మల్ బాయ్స్.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 - 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 


