logo

ప్రాజెక్టుకు గండి.. మరమ్మతులు చేపట్టాలి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 31 Oct 2025 15:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

శంకరపట్నం: శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు గండి పడింది. త్వరితగతిన  మరమ్మతులు  పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు గండి పడిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ప్రాజెక్టు ఆయకట్టు, రైతులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రెండేళ్లు గడిచినా మరమ్మతులపై నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వానికి తగదన్నారు. హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యేల తోడ్పాటుతో గండి పూడ్చివేత పనులు జరిగేలా చూడాలన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రైతాంగ సమస్యలు పట్టించుకోవాలని కోరారు. కాచాపూర్ గ్రామ శివారులో నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులను ఓదార్చారు. ఆమె వెంట తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు హరి ప్రసాద్, మండల అధ్యక్షురాలు సల్మా, వీణవంక, శంకరపట్నం మండలాల రైతులు ఉన్నారు.

Tags :
Published : 31 Oct 2025 15:17 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని